అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. ఈనెల 9న కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఏపీకి రానున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఈసీ బృందానికి ఇద్దరు నేతలూ ఫిర్యాదు చేయనున్నారు.
ఈ క్రమంలో ఈసీ బృందాన్ని కలవడానికి ముందే పవన్ కల్యాణ్.. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చే అల్పాహార విందుకు హాజరవుతా ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం వెంకటగిరిలో నిర్వహించాల్సిన 'రా.. కదలిరా..’ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. మధ్యాహ్నం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో బహిరంగ సభ యథాతథంగా జరగనుంది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఏపీ అధికారులతో ఈసీ బృందం సమావేశం కానుంది. ఈ నెల 9, 10 తేదీల్లో సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయెల్ ఏపీకి రానున్నారు. 9న రాజకీయ పార్టీలు, కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ బృందం భేటీ కానుంది. 10న సీఎస్, డీజీపీ సహా వివిధ శాఖల అధికారులతో సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడనున్నారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి