షోలాపూర్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం మహారాష్ట్ర లో పర్యటించారు. షోలాపూర్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ పథకం కింద పేద ప్రజలకు ఇళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. "పీఎం ఆవాస్ యోజన కింద నిర్మించిన దేశంలోనే అతిపెద్ద సొసైటీని నేడు ప్రారంభించాం. దీనిపై 2014లో నేను హామీ ఇచ్చా.
సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here
ఆ వాగ్దానం నెరవేరడం, దాన్ని చూడటానికి రావడం.. ఇవన్నీ పరిపూర్ణ క్షణాలు. ఈ ఇళ్లను చూడగానే నా బాల్యం గుర్తొచ్చింది. చిన్నతనంలో నాక్కూడా ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం వస్తే ఎలా ఉండేదో అని ఆలోచించా” అంటూ గద్గద స్వరంతో మాట్లాడారు. కన్నీళ్లను దిగమింగుకుని తన ప్రసంగాన్ని కొనసాగించారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి