Seed Axis Road: అమరావతి మాస్టర్ ప్లాన్ అమల్లోకి...! వేగంగా సాగుతున్న స్టీల్ బ్రిడ్జ్ పనులు! Predator Drone Deal: భారత్–అమెరికా ఒప్పందాలపై రాహుల్ ఫైర్…! వివరణ ఇవ్వాలి…! Nimmala Rama Naidu: శివరాత్రి పూట శ్రమదానం...! స్మశాన వాటికలో మంత్రి నిమ్మల రామానాయుడు సేవ! AI Development: విశాఖపట్నంకు గ్లోబల్ గుర్తింపు..! దేశంలోనే తొలి AI డేటా నగరం ఇక్కడే...! Bill Gates: ఏపీకి బిల్ గేట్స్ రాక..! అమరావతిలో గ్లోబల్ మీటింగ్..! PM Rahat Scheme: పీఎం రాహత్ స్కీమ్... రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల ఉచిత వైద్యం! Tech Hub: ఏపీలో మరో బెంగళూరు..! క్వాంటం వ్యాలీ నుండి డేటా సెంటర్ల వరకు.. టెక్ విప్లవం! APGovernment: మహాశివరాత్రికి డబుల్ హాలిడే…! అధికారిక ఉత్తర్వులు జారీ! Free Electricity: ఏపీ బడ్జెట్‌లో నేతన్నలకు పెద్దపీట..! ఉచిత విద్యుత్ అమలుకు ముహూర్తం ఖరారు! Free Bus: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఇక నుండి వారికి కూడా.. ఫ్రీ బస్సు! Seed Axis Road: అమరావతి మాస్టర్ ప్లాన్ అమల్లోకి...! వేగంగా సాగుతున్న స్టీల్ బ్రిడ్జ్ పనులు! Predator Drone Deal: భారత్–అమెరికా ఒప్పందాలపై రాహుల్ ఫైర్…! వివరణ ఇవ్వాలి…! Nimmala Rama Naidu: శివరాత్రి పూట శ్రమదానం...! స్మశాన వాటికలో మంత్రి నిమ్మల రామానాయుడు సేవ! AI Development: విశాఖపట్నంకు గ్లోబల్ గుర్తింపు..! దేశంలోనే తొలి AI డేటా నగరం ఇక్కడే...! Bill Gates: ఏపీకి బిల్ గేట్స్ రాక..! అమరావతిలో గ్లోబల్ మీటింగ్..! PM Rahat Scheme: పీఎం రాహత్ స్కీమ్... రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల ఉచిత వైద్యం! Tech Hub: ఏపీలో మరో బెంగళూరు..! క్వాంటం వ్యాలీ నుండి డేటా సెంటర్ల వరకు.. టెక్ విప్లవం! APGovernment: మహాశివరాత్రికి డబుల్ హాలిడే…! అధికారిక ఉత్తర్వులు జారీ! Free Electricity: ఏపీ బడ్జెట్‌లో నేతన్నలకు పెద్దపీట..! ఉచిత విద్యుత్ అమలుకు ముహూర్తం ఖరారు! Free Bus: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఇక నుండి వారికి కూడా.. ఫ్రీ బస్సు!

అధైర్యపడొద్దు...మీకు మేమున్నాం.. నారా భువనేశ్వరి భరోసా...

అధైర్యపడొద్దు...మీకు మేమున్నాం..- బాధిత కుటుంబాలకు భువనేశ్వరి భరోసా- ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల ఆర్థికసాయం- ముగిసిన ఉత్తరాంధ్ర నిజం గెలవాలి పర్యటన కుటుంబ పెద్

Published : 2024-01-06 04:15:00

అధైర్యపడొద్దు...మీకు మేమున్నాం..
- బాధిత కుటుంబాలకు భువనేశ్వరి భరోసా
- ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల ఆర్థికసాయం
- ముగిసిన ఉత్తరాంధ్ర నిజం గెలవాలి పర్యటన

కుటుంబ పెద్దలను కోల్పోయి శోకసంద్రంలో మునిగిన కుటుంబాలకు అధైర్యపడొద్దు...మీకు మేమున్నామంటూ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. నిజం గెలవాలి ఉత్తరాంధ్ర పర్యటన 3వ రోజు విశాఖపట్నం, గాజువాకలో నిర్వహించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక ఆకస్మికమరణానికి గురైన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. నోవాటెల్ విడిది కేంద్రం నుండి ప్రారంభమైన భువనేశ్వరి మొదటగా విశాఖ సౌత్ నియోజకవర్గంలోని 47వ వార్డులో టీడీపీ కార్యకర్త జాగరపు చిన్న(47) కుటుంబాన్ని పరామర్శించారు. చిన్న 03-10-2023న గుండెపోటుతో మరణించారు. చిన్న భార్య గౌరి, కుమార్తెలు దేవి, నందిని, కుమారుడు కిరణ్ లను భువనేశ్వరి పరామర్శించి ఓదార్చారు. కుటుంబపెద్ద లేరని అధైర్య పడొద్దు..మీకు పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

బాధిత కుటుంబానికి రూ.3లక్షల చెక్కు అందించి ఆర్థికసాయం చేశారు. అనంతరం 41వ వార్డులోని మలిశెట్టి రమణ(55) కుటుంబాన్ని పరామర్శించారు. రమణ 2023 అక్టోబర్ 9న గుండెపోటుతో మృతిచెందారు. వారి కుమారుడు రాజు, కోడలు సంతోషి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్నివేళలా అండగా నిలుస్తుందని ధైర్యం చెప్పారు. రూ.3లక్షల చెక్కు అందించి ఆర్థికసాయం అందించారు. అనంతరం విశాఖ నార్త్ నియోజకవర్గంలోని 45వ వార్డులో పంచిరెడ్డి కనకారావు(52) కుటుంబాన్ని పరామర్శించారు. కనకారావు 2023 సెప్టెంబర్ 13న గుండెపోటుతో మరణించారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

వారి భార్య పార్వతి, కుమార్తె ఉదయశ్రీ, కుమారుడు శ్యామ్ లను భువనేశ్వరి పరామర్శించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలు పార్టీ కుటుంబ సభ్యులని, వారికి పార్టీ అండగా నిలబడుతుందని ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి రూ.3లక్షల చెక్కు అందించి ఆర్థికసాయం చేశారు.
భోజన విరామం అనంతరం గాజువాక నియోజకవర్గంలోని బాధిత కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. మొదటగా గాజువాక 65వ వార్డులోని కోరుకొండ వెంకటరమణ(61) కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. వెంకటరమణ భార్య మంగ, కుమారుడు శ్రీను, కుమార్తె లక్ష్మిలతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షల చెక్కు అందించి ఆర్థికసాయం చేశారు.

అనంతరం గాజువాక 65వ వార్డులోని ఉప్పలపాటి సరోజిని కుటుంబాన్ని పరామర్శించారు. సరోజిని భర్త వెంకట అప్పల నరసింహరాజు, కుమారుడు శ్రీనివాసరాజు, కోడలు సునీత, కుమార్తె లక్ష్మిలతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు రూ.3లక్షల చెక్కు అందించి ఆర్థికసాయం అందించారు. అనంతరం 69వ వార్డులోని పమిడిముక్కల రాధాకృష్ణమూర్తి కుటుంబాన్ని పరామర్శించారు. రాధాకృష్ణమూర్తి కుమారులు వెంకట్రావు, ప్రభాకర్, కోడళ్లు స్వరాజ్యలక్ష్మి, శశికళ లతో మాట్లాడి వారిని ఓదార్చారు. పార్టీ అన్నివిధాలా అండగా నిలబడుతుందని ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి రూ.3లక్షల ఆర్థిసాయం అందించారు. బాధిత కుటుంబాల పరామర్శ అనంతరం విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరకుని హైదరాబాద్ వెళ్లారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →