గత వైకాపా ప్రభుత్వంలో అధికారులను విపరీతంగా బెదిరించారని హోంమంత్రి అనిత విమర్శించారు. కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు అందరినీ బెదిరించారన్నారు. విజయవాడలో సబైజైలును ఆమె ఆకస్మికంగా సందర్శించి ఖైదీలతో ముఖాముఖి నిర్వహించారు. "ప్రజలు మంచి నిర్ణయం తీసుకుని మాకు అధికారమిచ్చారు. ఖైదీని ఖైదీలా.. ముద్దాయిని ముద్దాయిలా చూడాలి. తప్పు చేసిన వారెవరినీ వదిలే ప్రసక్తే లేదు. కచ్చితంగా నిఘా ఉంటుంది.. చర్యలు తప్పవు. సబ్ జైలు మౌలిక వసతులపై ఆరా తీశాం. జైలులో అధికారులపై వస్తున్న ఆరోపణలపై వివరాలు సేకరించాం. విచారణ జరుగుతోంది. రెండు రోజుల్లో నివేదిక వస్తుంది. దానిపై త్వరలో చర్యలు తీసుకుంటాం. తమ తప్పులు బయట పడుతున్నాయన్న భయంతో విజయసాయి రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి ఆయనది కాదు. విజయసాయి రెడ్డిపై తప్పకుండా కేసులు నమోదు చేస్తాం. కాకినాడ పోర్టు కేసులో విచారణ జరుగుతోంది. వైకాపా నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. జగన్ అండ్ కో ఏపీ సంపదను దోచుకున్నారు” అని అనిత విమర్శించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
శబరిమల దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! ఇంక పండగే పండగ! ప్రత్యేక రైలు సర్వీసులు!
ఒరేయ్ మీ దుంపలు తెగ.. 102 ఏళ్ల మహిళను పెళ్లాడిన 100 ఏళ్ల పెళ్లికొడుకు! ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..
రైల్వే స్టేషన్లో కోతుల ఫైట్ వల్ల ఆగిపోయిన రైళ్లు! అసలు ఏం జరిగిందంటే!
అప్డేట్.. ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రిటర్న్ రాలేదా? అయితే ఇలా చేయండి! రాష్ట్రంలో ఏ ఇతర పథకాల్లో..
దారుణం.. తిరుమల కొండపై కారు దగ్ధం! ఆ సమయంలో కారులో...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: