NATO: ట్రంప్ సంచలన ప్రకటన... నాటోకు గుడ్ బై చెప్పే యోచనలో అమెరికా? Nara Lokesh: రాత్రికి ఢిల్లీ వెళ్లనున్న మంత్రి నారా లోకేష్.. రాష్ట్ర భవిష్యత్తు కోసం కీలక అడుగులు.. Chandrababu: వైసీపీ నేతలు తీవ్రవాదుల కంటే ప్రమాదకరం.. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు.. సిగ్గుపడే స్థితిలో.. Tiger Scare: రామదుర్గం కొండల్లో హైటెన్షన్... పులి సంచారంతో చిక్కుకుపోయిన 50 మంది పర్యాటకులు! Amaravati Capital: అమరావతికి లోక్‌సభ పట్టాభిషేకం... చారిత్రాత్మక బిల్లుకు ఆమోదం! ఇంచ్ కూడా కదిలించలేరు... Chandrababu: వింజమూరులో ముఖ్యమంత్రి పర్యటన.. నేరుగా ఇంటికే పింఛను.. సమస్యల పరిష్కారమే లక్ష్యం.! AP Govt: కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం.. నేతన్నలకు వెలుగుల పండుగ! గ్రీన్ ఎనర్జీ దిశగా అడుగులు.. Income Tax: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. దేశ పన్నుల విధానంలో విప్లవాత్మక మార్పులు! Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ సరికొత్త రికార్డు.... మార్చిలో దూసుకుపోయిన అమ్మకాలు! రోజుకు 1,000 పైగా ఆర్డర్లు... Manickam Tagore: అమరావతిని అడ్డుకోం.. అండగా ఉంటాం! లోక్‌సభలో రాజధాని చట్టబద్ధత బిల్లుకు సంపూర్ణ మద్దతు.. NATO: ట్రంప్ సంచలన ప్రకటన... నాటోకు గుడ్ బై చెప్పే యోచనలో అమెరికా? Nara Lokesh: రాత్రికి ఢిల్లీ వెళ్లనున్న మంత్రి నారా లోకేష్.. రాష్ట్ర భవిష్యత్తు కోసం కీలక అడుగులు.. Chandrababu: వైసీపీ నేతలు తీవ్రవాదుల కంటే ప్రమాదకరం.. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు.. సిగ్గుపడే స్థితిలో.. Tiger Scare: రామదుర్గం కొండల్లో హైటెన్షన్... పులి సంచారంతో చిక్కుకుపోయిన 50 మంది పర్యాటకులు! Amaravati Capital: అమరావతికి లోక్‌సభ పట్టాభిషేకం... చారిత్రాత్మక బిల్లుకు ఆమోదం! ఇంచ్ కూడా కదిలించలేరు... Chandrababu: వింజమూరులో ముఖ్యమంత్రి పర్యటన.. నేరుగా ఇంటికే పింఛను.. సమస్యల పరిష్కారమే లక్ష్యం.! AP Govt: కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం.. నేతన్నలకు వెలుగుల పండుగ! గ్రీన్ ఎనర్జీ దిశగా అడుగులు.. Income Tax: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. దేశ పన్నుల విధానంలో విప్లవాత్మక మార్పులు! Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ సరికొత్త రికార్డు.... మార్చిలో దూసుకుపోయిన అమ్మకాలు! రోజుకు 1,000 పైగా ఆర్డర్లు... Manickam Tagore: అమరావతిని అడ్డుకోం.. అండగా ఉంటాం! లోక్‌సభలో రాజధాని చట్టబద్ధత బిల్లుకు సంపూర్ణ మద్దతు..

Ram Mohan: ఆ స్కూళ్లకు మహర్దశ.. మంత్రి రామ్మోహన్ చొరవతో రూ. 30 లక్షల నిధులు మంజూరు.!

Ram Mohan: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. విద్యార్థులకు కేవలం పాఠ్యపుస్తకజ్ఞానమే కాకుండా, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా అదనపు నైపుణ్యాలను అందించే లక్ష్యంతో రెండు పాఠశాలల్లో అత్యాధునిక 'స్కిల్ ల్యాబ్స్' ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

Published : 2026-04-01 11:09:00
  • సర్వ శిక్షా అభియాన్ పర్యవేక్షణలో పనులు: శ్రీకాకుళం ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే దిశగా అడుగులు..
     
  • Politics: "నిమ్మడ జడ్పీ హైస్కూల్‌లో అత్యాధునిక ల్యాబ్స్": సొంత ఊరి బడిపై కేంద్ర మంత్రి మమకారం…

Ram Mohan: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. విద్యార్థులకు కేవలం పాఠ్యపుస్తకజ్ఞానమే కాకుండా, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా అదనపు నైపుణ్యాలను అందించే లక్ష్యంతో రెండు పాఠశాలల్లో అత్యాధునిక 'స్కిల్ ల్యాబ్స్' ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇందుకోసం పియర్సన్ ఇండియా ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల నుంచి రూ.30 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. గతంలో మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా సదరు సంస్థ ప్రతినిధులతో సమావేశమై, తన సొంత జిల్లాలోని విద్యా వ్యవస్థ బలోపేతానికి సహకరించాలని కోరిన నేపథ్యంలో ఈ నిధులు విడుదలయ్యాయి.

ఈ నిధులతో శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మరియు మంత్రి సొంత గ్రామమైన నిమ్మడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కిల్ ల్యాబ్స్‌ను నిర్మించనున్నారు. ఒక్కో పాఠశాల అభివృద్ధికి రూ.15 లక్షల చొప్పున కేటాయించగా, ఈ ప్రాజెక్టుకు సంబంధించి శ్రీకాకుళం కలెక్టరేట్ మంగళవారం అధికారికంగా పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ముఖ్యంగా ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్‌ను తాను దత్తత తీసుకుని ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతానని రామ్మోహన్ నాయుడు గతంలోనే ప్రకటించగా, తాజా నిధుల మంజూరుతో ఆ దిశగా కీలక అడుగు పడింది. ఈ స్కిల్ ల్యాబ్స్ ద్వారా విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఉపాధికి అవసరమైన వివిధ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అమలు బాధ్యతలను ప్రభుత్వం సర్వ శిక్షా అభియాన్ అధికారులకు అప్పగించింది. ల్యాబ్స్ నిర్వహణతో పాటు విద్యార్థులకు నిరంతరాయంగా నైపుణ్య శిక్షణ అందించే బాధ్యతను 'కాగ్నో స్పేస్' అనే సంస్థ పర్యవేక్షించనుంది. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైతే, భవిష్యత్తులో జిల్లాలోని మరిన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఈ స్కిల్ ల్యాబ్స్ సౌకర్యాన్ని విస్తరించాలని అధికారులు యోచిస్తున్నారు. కేంద్ర మంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ, తన సొంత జిల్లా విద్యాభివృద్ధిపై రామ్మోహన్ నాయుడు చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ పట్ల స్థానిక విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Spotlight

Read More →