AP Govt: రాష్ట్రంలో న‌ర్సింగ్ విద్యా సంస్థ‌ల ఏర్పాటుపై కీల‌క నిర్ణ‌యం.. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల‌కు అనుగుణంగా.. Amaravati: దేశంలో 25% పెట్టుబడుల ఆకర్షణతో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్.. కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కుట్రలు! High Court: రిజర్వేషన్ల ఖరారుకు ఆ సర్వేనే కీలకం.. త్వరలోనే కొత్త కమిషనర్ రాకపై - హైకోర్టు కీలక ఆదేశం! Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ-మెక్రాన్ చర్చ.. శాంతి పునరుద్ధరణే లక్ష్యంగా అగ్రనేతల ఫోన్ కాల్! Chandrababu: మంత్రుల బృందానికి చంద్రబాబు క్లాస్: పయ్యావుల, నారాయణ, సత్యకుమార్‌లకు కీలక సూచనలు.. కేవలం సిద్ధాంతం కాదు.. Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం! స్కూల్ కమిటీలకే పాఠశాలల అభివృద్ధి బాధ్యతలు! Prajavedhika: అంజమ్మపై గొడ్డలి వేటు... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భూమి మాయం! మాయలేడి రూ.10 లక్షల టోకరా.... Spicy Chicken: స్పైసీ చికెన్ లవర్స్ కోసం ప్రత్యేక రెసిపీ..! వెల్లుల్లి ఘాటుతో అదిరిపోయే టేస్ట్! Delhi Airport Incident: ఢిల్లీ విమానాశ్రయంలో ప్రమాదం... ఒకదానికొకటి ఢీకొన్న విమానాలు!! BSNL ధమాకా ఆఫర్... రూ. 200 లోపే 30 రోజుల వ్యాలిడిటీ మరియు అన్లిమిటెడ్ కాల్స్! AP Govt: రాష్ట్రంలో న‌ర్సింగ్ విద్యా సంస్థ‌ల ఏర్పాటుపై కీల‌క నిర్ణ‌యం.. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల‌కు అనుగుణంగా.. Amaravati: దేశంలో 25% పెట్టుబడుల ఆకర్షణతో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్.. కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కుట్రలు! High Court: రిజర్వేషన్ల ఖరారుకు ఆ సర్వేనే కీలకం.. త్వరలోనే కొత్త కమిషనర్ రాకపై - హైకోర్టు కీలక ఆదేశం! Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ-మెక్రాన్ చర్చ.. శాంతి పునరుద్ధరణే లక్ష్యంగా అగ్రనేతల ఫోన్ కాల్! Chandrababu: మంత్రుల బృందానికి చంద్రబాబు క్లాస్: పయ్యావుల, నారాయణ, సత్యకుమార్‌లకు కీలక సూచనలు.. కేవలం సిద్ధాంతం కాదు.. Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం! స్కూల్ కమిటీలకే పాఠశాలల అభివృద్ధి బాధ్యతలు! Prajavedhika: అంజమ్మపై గొడ్డలి వేటు... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భూమి మాయం! మాయలేడి రూ.10 లక్షల టోకరా.... Spicy Chicken: స్పైసీ చికెన్ లవర్స్ కోసం ప్రత్యేక రెసిపీ..! వెల్లుల్లి ఘాటుతో అదిరిపోయే టేస్ట్! Delhi Airport Incident: ఢిల్లీ విమానాశ్రయంలో ప్రమాదం... ఒకదానికొకటి ఢీకొన్న విమానాలు!! BSNL ధమాకా ఆఫర్... రూ. 200 లోపే 30 రోజుల వ్యాలిడిటీ మరియు అన్లిమిటెడ్ కాల్స్!

High Court: రిజర్వేషన్ల ఖరారుకు ఆ సర్వేనే కీలకం.. త్వరలోనే కొత్త కమిషనర్ రాకపై - హైకోర్టు కీలక ఆదేశం!

High Court: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) నియామకం మరియు బీసీ కులగణన సర్వేపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బీసీ జనగణన పూర్తి చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బీసీ నేత శంకర్రావు దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు, పంచాయతీల పదవీకాలం ముగిసినందున తక్షణమే ఎన్నికలు జరపాలని న్యాయవాది యోగేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం గురువారం విచారించింది.

Published : 2026-04-16 21:48:00
  • బీసీ సర్వే 99.5 శాతం పూర్తి: హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్..
     
  • Politics: "గవర్నర్ వద్ద ఎస్‌ఈసీ నియామక ఫైల్": త్వరలోనే కొత్త కమిషనర్ రాకపై ఏజీ స్పష్టత..

High Court: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) నియామకం మరియు బీసీ కులగణన సర్వేపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బీసీ జనగణన పూర్తి చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బీసీ నేత శంకర్రావు దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు, పంచాయతీల పదవీకాలం ముగిసినందున తక్షణమే ఎన్నికలు జరపాలని న్యాయవాది యోగేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా బీసీ సర్వే పురోగతి మరియు ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

విచారణ సందర్భంగా రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (AG) దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ, రాష్ట్రంలో బీసీ సామాజిక, ఆర్థిక సర్వే ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకుందని తెలిపారు. ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ మరియు విలేజ్/వార్డ్ సెక్రటేరియట్ విభాగాల ద్వారా జరుగుతున్న ఈ సర్వే ఇప్పటికే 99.5 శాతం పూర్తయిందని, మిగిలిన స్వల్ప భాగాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని కోర్టుకు నివేదించారు. బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ఈ గణాంకాలు అత్యంత కీలకమని, అందుకే ప్రభుత్వం ఈ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తోందని ఏజీ వివరించారు.

మరోవైపు, గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకంపై కూడా ఏజీ స్పష్టత ఇచ్చారు. ఎస్‌ఈసీ నియామకానికి సంబంధించిన ఫైల్ ప్రస్తుతం గవర్నర్ వద్ద ఉందని, ఒకటి రెండు రోజుల్లోనే ఆయన ఆమోదం లభించే అవకాశం ఉందని తెలిపారు. నియామక ప్రక్రియ పూర్తి కాగానే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ముందడుగు వేస్తామని కోర్టుకు వెల్లడించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్. రఘునందన్ రావుల ధర్మాసనం, తదుపరి విచారణను ఈనెల 23వ తేదీకి వాయిదా వేస్తూ, అప్పటిలోగా పూర్తి సమాచారంతో కూడిన అఫిడవిట్‌ను సమర్పించాలని ఆదేశించింది.

Spotlight

Read More →