Politics- దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. నేటి రాత్రి 8:30 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగం!
మోదీ ఏం చెప్పబోతున్నారు? నేటి రాత్రి ప్రధాని ప్రసంగంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ…
కీలక ప్రకటనకు రంగం సిద్ధం…
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేటి రాత్రి 8:30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. పార్లమెంటులో కీలక బిల్లుల ఆమోదం లేదా దేశంలో నెలకొన్న తాజా రాజకీయ, ఆర్థిక పరిణామాలపై ఆయన కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు లేదా నూతన ఆర్థిక సంస్కరణల గురించి ఆయన మాట్లాడతారని అంచనా వేస్తున్నారు. ప్రధాని ప్రసంగం నేపథ్యంతో దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ ప్రసంగం దూరదర్శన్, ఆలిండియా రేడియోతో పాటు అన్ని ప్రధాన వార్తా సంస్థలలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. గతంలో ప్రధాని ఇలా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రతిసారీ దేశ భవిష్యత్తును మార్చే కీలక నిర్ణయాలు వెలువడిన నేపథ్యంలో, నేటి ప్రసంగంపై ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి.