Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర!

Kollu Ravindra: నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారానే భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసుకునే వీలు కుదురుతుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

Published : 2026-03-30 22:40:00
  • సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారానే భవిష్యత్తు ఉంటుంది..
     
  • Politics: కర్నూలులో డ్రోన్ పార్క్ ఏర్పాటు..

Kollu Ravindra: నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారానే భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసుకునే వీలు కుదురుతుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. భీమవరంలో ఏర్పాటు చేసిన JDK డ్రోన్స్ (దేశంలో ఏకైక డ్రోన్ ఎక్స్పీరియన్స్ సెంటర్)ను శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణమ రాజు గారితో కలిసి ప్రారంభించారు. అనంతరం డ్రోన్స్ తయారీ, వినియోగం గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా వ్యవసాయ రంగంలో వినియోగించే డ్రోన్ల వినియోగాన్ని అభినందించారు. వ్యవసాయం, అత్యవసర సేవల విభాగంలో డ్రోన్ల వినియోగం వినూత్న మార్పు అన్నారు.

వ్యవసాయం, ఆక్వా రంగంలో డ్రోన్ల వినియోగం అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తోంది. కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందుకోవాలి. డ్రోన్ల వినియోగంపై ప్రభుత్వం అత్యంత శ్రద్ద పెట్టింది. ఇప్పటికే డ్రోన్స్ పాలసీ తీసుకొచ్చాం. కర్నూలులో డ్రోన్ పార్క్ ఏర్పాటు చేశాం. నూతన సాంకేతికను అందుకోవడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు అందరి కంటే ముందుంటారని మొన్న విజయవాడ వరదల సమయంలో నిరూపించారు. పడవలు, వాహనాలు వెళ్లలేని ప్రాంతాల్లోని వారికి డ్రోన్ల ద్వారా ఆహారం, మందులు, మంచినీరు అందించాం. భవిష్యత్తులో ఈ రంగం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. భవిష్యత్తును ముందే ఊహించి దేశంలోనే తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ భీమవరంలో ఏర్పాటు అభినందనీయం. డ్రోన్ టెక్నాలజీకి ఏపీ కేంద్రంగా మారబోతోంది అనడానికి ఈ కేంద్రం ఏర్పాటు నిదర్శనమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు

Spotlight

Read More →