Mangalagiri: మంగళగిరిలో ఈగల్ హెడ్‌క్వార్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా..

Mangalagiri: మంగళగిరిలో ‘ఈగల్’ (EAGLE) హెడ్‌క్వార్టర్స్ కార్యాలయాన్ని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ ఐజీ రవికృష్ణతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Published : 2026-04-25 12:53:00

మంగళగిరిలో ఈగల్ హెడ్‌క్వార్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా..

కార్యక్రమంలో పాల్గొన్న ఈగల్ ఐజీ రవికృష్ణ, పోలీసు ఉన్నతాధికారులు..

మంగళగిరిలో ‘ఈగల్’ (EAGLE) హెడ్‌క్వార్టర్స్ కార్యాలయాన్ని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ ఐజీ రవికృష్ణతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కొత్తగా ప్రారంభమైన ఈ కార్యాలయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఈగల్ కార్యకలాపాలను ఒకే చోట నుంచి పర్యవేక్షించనున్నట్లు అధికారులు తెలిపారు. డ్రగ్స్, గంజాయి నియంత్రణలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.

ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, గత ఏడాదిన్నర కాలంలో ‘ఈగల్’ విభాగం మంచి పనితీరు కనబరిచిందన్నారు. ఒకప్పుడు వేల ఎకరాల్లో సాగు అయిన గంజాయి పంటను ప్రస్తుతం దాదాపు జీరో స్థాయికి తీసుకువచ్చామని తెలిపారు. ఇది పోలీసు శాఖకు పెద్ద విజయమని పేర్కొన్నారు.

ఇప్పుడేమైతే గంజాయి సాగును నియంత్రించామో, ఇకపై వినియోగదారులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నామని ఆయన స్పష్టం చేశారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల నియంత్రణకు సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నామని వివరించారు.

అదేవిధంగా, డ్రగ్స్ మరియు గంజాయి కేసుల వేగవంతమైన విచారణ కోసం రాష్ట్రంలో కొత్తగా 13 ఎన్‌డీపీఎస్ కోర్టులను ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. ఈ చర్యలతో మాదక ద్రవ్యాల నియంత్రణలో మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఈగల్ హెడ్‌క్వార్టర్స్ ప్రారంభంతో రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నియంత్రణకు మరింత బలం చేకూరుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Spotlight

Read More →