AndhraPradesh: ఏపీలోని ఆ కాంట్రాక్టు సిబ్బందికి షాక్.. 50 ఏళ్ల వరకే సర్వీస్..!

తెలంగాణ రాష్ట్ర ప్రజాసేవా కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించిన గ్రూప్‌–2 సర్వీసు నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. గత నెల 28న విడుదలైన తుది ఫలితాల ద్వారా మొత్తం 783 పోస్టుల భర్తీకి సంబంధించిన వివరాలు వెల్లడించాయి. వీటిలో 782 పోస్టులకు ఎంపిక జాబితాను విడుదల చేస్తూ, ఒక పోస్టును మాత్రం ‘విత్‌హెల్డ్‌’ కింద ఉంచారు. మొత్తం 16 శాఖల్లో 18 రకాల పోస్టులకు సంబంధించిన ఈ ఫలితాలను కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్ల ఆధారంగా ఫలితాలను పరిశీలించుకోవచ్చు.

Gold prices: వామ్మో ఒక్కరోజులోనే రెండుసార్లు పెరిగిన బంగారం ధరలు.. ఎంత అంటే!

ఈ ఫలితాల అనంతరం, ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. తాజాగా వెలువడిన ప్రకటన ప్రకారం, అక్టోబర్‌ 18న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదగా నియామక పత్రాలను అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపికైన 783 మంది అభ్యర్థులతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు సజావుగా సాగేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు నేతృత్వంలో మంగళవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాత పరీక్ష లేదు! అకౌంటెంట్, వాచ్‌మాన్ సహా 13 విభాగాలలో...కేవలం ఆ జిల్లా వారికి మాత్రమే!!

సమావేశంలో సాధారణ పరిపాలన, రెవెన్యూ, ఎక్సైజ్, పంచాయతీరాజ్‌, వాణిజ్య పన్నులు వంటి శాఖలకు చెందిన నియామక అభ్యర్థులు అధికంగా ఉన్నట్లు వెల్లడించారు. అందువల్ల ఆయా శాఖల కార్యదర్శులు పరస్పర సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహణలో చురుకుగా వ్యవహరించాలని సీఎస్‌ ఆదేశించారు. ఈ నియామక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో చేపట్టిన కీలక అడుగుగా భావిస్తున్నారు. ముఖ్యంగా, చాలా కాలంగా నిరీక్షణలో ఉన్న అభ్యర్థులకు ఇది శుభవార్తగా నిలిచింది.

Lokesh: వైసీపీలా కాదు.. బుల్డోజర్లను అభివృద్ధికి వాడుతున్నాం.. మంగళగిరిలో కొత్త షోరూమ్.. మంత్రి లోకేశ్!

గమనించదగ్గ విషయం ఏమిటంటే, టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ను 2022లో విడుదల చేసింది. అనంతరం, 2024 డిసెంబర్‌ 15 మరియు 16 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా రాత పరీక్షలను ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 2,49,964 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే, ఓఎంఆర్‌ పత్రాల్లో లోపాలు, బబ్లింగ్‌ పొరపాట్లు వంటి సాంకేతిక కారణాల వల్ల దాదాపు 13,315 మందిని కమిషన్‌ అనర్హులుగా ప్రకటించింది. మిగిలిన 2,36,649 మంది అభ్యర్థుల జనరల్‌ ర్యాంక్‌ లిస్ట్‌ను మార్చి 11న మార్కులతో సహా విడుదల చేశారు. దీని తర్వాత జరిగిన ధ్రువపత్రాల పరిశీలన, మెరిట్‌ ప్రాధాన్యతా ప్రక్రియ అనంతరం సెప్టెంబర్‌ 28న తుది జాబితా వెలువడింది. ఈ జాబితాలో ఉన్న వారందరికీ మరో మూడు రోజుల్లో అధికారికంగా నియామక పత్రాలు అందజేయబోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు.. ఎందుకోసం అంటే ?
హ్యుందాయ్ వెన్యూ 2025 నెక్స్ట్ జనరేషన్ మోడల్‌! స్టైలిష్ లుక్‌, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, శక్తివంతమైన పనితీరు!
Bhagavad Gita : మనసులో శాంతి, మాటల్లో మృదుత్వం, కష్టాల్లో ఓర్పు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -33!
BSF Constable: బీఎస్‌ఎఫ్‌లో క్రీడాకారులకు గుడ్ న్యూస్..! రాత పరీక్ష లేకుండా ఉద్యోగం.. జీతం రూ.69,000 వరకు..!
RRB NTPC ఉద్యోగాలు: మొత్తం ఖాళీలు, వయసు & జీతం పూర్తి వివరాలు!!
పిత్తు వాసన భరించలేకుండా ఉంటే... వెంటనే చేయాల్సిన మార్పులు ఇవిగో!!