Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!! Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..! వైసీపీ నేతల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!! Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..! వైసీపీ నేతల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్!

లోకేష్ మాట‌.. బ్రాహ్మిణి బాట‌.. చేనేతలకు మంచి రోజులు వచ్చేసాయి! వస్త్రాలపై జిఎస్టీ రద్దు!

2024-02-17 20:18:00

చేనేత‌రంగాన్ని ద‌త్త‌త తీసుకుంటాన‌న్న నారా లోకేష్‌

నారా లోకేష్‌లో స‌గ‌మే కాదు, ఆయ‌న‌ ఆశ‌య‌సాధ‌న‌లోనూ స‌గ‌మ‌య్యారు భార్య నారా బ్రాహ్మిణి.  చేనేతకి చేయూత అందించాల‌నే నారా లోకేష్ ప్ర‌ణాళిక‌ల‌కు కార్య‌రూపం ఇవ్వ‌డంతో తొలి అడుగు వేశారు బ్రాహ్మిణి. చేనేత‌ని ద‌త్త‌త తీసుకుంటాన‌న్న భ‌ర్త మాట‌ని త‌న బాట‌గా చేసుకుని టాటా వారి స‌హ‌కారంతో వీవ‌ర్‌శాల ప్రారంభించారు.

ఇంకా చదవండి:  ఒమన్: 150 కిలోల మాదకద్రవ్యాలు! 8 మంది ప్రవాసులు అరెస్ట్! కఠిన శిక్షలు తప్పవు!

తన మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంతోపాటు రాష్ట్ర‌వ్యాప్తంగా చేనేతలు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు శాశ్వ‌తంగా ప‌రిష్క‌రించాల‌నేది టిడిపి యువ‌నేత నారా లోకేష్ ల‌క్ష్యం. దీని కోసం ఎన్నో ప్ర‌ణాళిక‌లు రూపొందించారు. చేనేత‌ల స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం చేయించారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో చేనేత‌ల క‌ష్టాలు, క‌న్నీళ్లు చూసి మ‌రింత‌గా చ‌లించిపోయారు. చేనేత రంగాన్ని ద‌త్త‌త తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించి కొన్ని హామీలు ఇచ్చారు.

       మగ్గం ఉంటే 200, మరమగ్గాలుంటే 500 యూనిట్ల ఉచిత విద్యుత్

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఈ హామీల అమ‌లులో భాగంగా చేనేత‌ల‌కు చేయూత‌నందించే పైల‌ట్ ప్రాజెక్టు త‌న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో చేప‌ట్టారు. మంగ‌ళ‌గిరిలో ఇప్ప‌టికే రాట్నాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. రాజ‌కీయాల‌కు అతీతంగా చేనేత ప‌రిర‌క్ష‌ణే ధ్యేయంగా స‌త్సంక‌ల్పంతో లోకేష్ ఆరంభించిన బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి తొలి ఆశీస్సులు అమ్మ భువ‌నేశ్వ‌రి నుంచి ల‌భించాయి. నిజం గెల‌వాలి కార్య‌క్ర‌మంలో భాగంగా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన నారా భువ‌నేశ్వ‌రి గారు మంగ‌ళ‌గిరి చేనేత చీర క‌ట్టుకుని వ‌చ్చి తాము చేనేత‌ల‌కు, చేనేత వ‌స్త్రాల‌కు ఇచ్చే ప్రాధాన్య‌త‌ని చాటిచెప్పారు.

చేనేతకి పూర్వ‌వైభ‌వం తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్న త‌న భ‌ర్త నారా లోకేష్ క‌ల సాకారానికి భార్య బ్రాహ్మిణి తోడ‌య్యారు. టాటా తనేరా, ఎన్ఆర్ఐలు, చేనేత‌ల స‌హ‌కారంతో వీవ‌ర్ శాల‌ను ప్రారంభించారు. త‌నేరా సీఈవో అంబుజ నారాయణ, హెరిటేజ్‌ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో నారా బ్రాహ్మిణి

వీవర్‌శాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి బ్రాహ్మిణి మంగ‌ళ‌గిరి చేనేతలు నేసిన‌ చీర క‌ట్టుకుని, మంగ‌ళ‌గిరి చేనేత చీర‌ల‌కు విస్తృత ప్ర‌చారం క‌ల్పించారు. 

వీవర్‌శాలలో ఏర్పాటు చేసిన ఆధునాతన చేనేత మగ్గాలను, ఆత్మకూరులోని చేనేత డైయింగ్ షెడ్‌ని పరిశీలించిన నారా బ్రాహ్మణి కార్మికుల‌ను స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు.  రంగులు అద్దే ప్ర‌క్రియ‌లో కెమికల్స్ వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామ‌ని, క‌ష్టానికి స‌రిప‌డా ఆదాయం లేద‌ని చేనేత కార్మికులు వాపోయారు. ప‌ని ప‌రిస్థితులు మెరుగుద‌ల‌, వ‌స్త్రాల‌కు ఆధునిక హంగులు అద్ద‌డంలో శిక్ష‌ణ‌,యంత్రాల వినియోగం, ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని గుర్తించారు. నేసిన చీర‌ల‌కు మార్కెటింగ్, ద‌ళారీలు లేకుండా చేయ‌గ‌లిగితే చేనేత‌ల‌కు ఆదాయం అద‌నంగా వ‌స్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

మ‌హిళ‌లు స్వ‌యం ఉపాధి పొందేందుకు నారా లోకేష్ ఆరంభించిన స్త్రీశ‌క్తి శిక్ష‌ణా కేంద్రాన్ని నారా బ్రాహ్మిణి సంద‌ర్శించారు. ఇప్పటికే 47 బ్యాచ్‌లలో వేలాది మందికి శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు అందించామ‌ని నిర్వాహ‌కులు వివ‌రించారు. అద్భుత‌మైన కార్య‌క్ర‌మం అని, స్త్రీశ‌క్తిని చూస్తే ముచ్చ‌టేస్తుంద‌ని ఆమె సంతోషం వ్య‌క్తం చేశారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు అయిన దేశాలు! భారత్ ర్యాంక్ ఎంతో తెలుసా?

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →