ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.! తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..! Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53! BCCI serious : దుబాయ్ మీటింగ్‌లో నఖ్వీపై BCCI సీరియస్.. ట్రోఫీ వివాదం తేలనుందా! భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! Governance: గ్రామ సచివాలయాలకు గుడ్‌బై..! ఇకపై పేరు మార్పు.. ప్రజా సేవలకు కొత్త దిశ..! పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు! Water Supply: తాగునీటి సమస్యలపై భారీ ప్రణాళిక..! భూగర్భ జలాలకు బదులుగా ఆ జలాలతో నీటి సరఫరా..! ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం.. విశాఖపట్నం - భోగాపురం మధ్య ఏటీఎఫ్ పైప్‌లైన్.. ఆ మార్గంలోనే.! తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..! Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53! BCCI serious : దుబాయ్ మీటింగ్‌లో నఖ్వీపై BCCI సీరియస్.. ట్రోఫీ వివాదం తేలనుందా! భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! Governance: గ్రామ సచివాలయాలకు గుడ్‌బై..! ఇకపై పేరు మార్పు.. ప్రజా సేవలకు కొత్త దిశ..! పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు! Water Supply: తాగునీటి సమస్యలపై భారీ ప్రణాళిక..! భూగర్భ జలాలకు బదులుగా ఆ జలాలతో నీటి సరఫరా..!

యాత్రా తరంగిణి 17: 2500 ఏళ్ల చరిత్ర ఉన్న పాండ్యుల కాలంనాటి... మధురై మీనాక్షి ఆలయం! గోపురం అనే పదం ఆవిర్భవించింది అక్కడే!

2024-04-17 11:23:00

రచయిత: కాపెర్ల పవన్ కుమార్, 9908300831

మదురై
పదిహేను అంతస్థుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న, 1500 కు పైగా రంగురంగుల శిల్పాలు కలిగిన ఒక పురాతన రాజ గోపురం మీ కళ్ళ ముందు ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆ ఊహ నిజం చేసుకోవాలంటే తప్పకుండా మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవలసిందే. దేశవ్యాప్తంగా ఉన్న అతి పవిత్ర, పురాతన దేవాలయాల్లో మధుర మీనాక్షి ఆలయం ఒకటి. ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రం లోని రెండో అతి పెద్ద నగరమైన మదురైలో ఉంది. సుమారు 2500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం పాండ్య రాజుల కాలం నుంచే పూజలందుకుంది. మీనాక్షి అమ్మవారి ఆలయం యొక్క విస్తీర్ణం దాదాపు 700,000 చదరపు అడుగులు. రోజుకు సుమారు 20,000 మంది ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు, ఇందులో రెండు ప్రధాన దేవాలయాలు మరియు వివిధ పరిమాణాలతో డజన్ల కొద్దీ ఉపాలయాలు ఉన్నాయి.

ఈ క్షేత్రం ఒక దేవుడిచే స్థాపించబడి, మరో దివ్య దంపతులచే పాలించబడుతుంది. భారతదేశంలోని అనేక పవిత్ర స్థలాలు మరియు నిర్మాణాలు పౌరాణిక మూలాలను కలిగి ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం దక్షిణ భాగాన ఉన్న మదురై నగరం దీనికి మినహాయింపు కాదు. 3500 సంవత్సరాల క్రితం ఇంద్రుడు శివుని పై ఉన్న భక్తికి చిహ్నంగా సహజంగా ఏర్పడిన రాయిపై ఒక చిన్న గోపురాన్ని ఏర్పాటు చేశాడు. ఇతర దేవతలు ఇంద్రుని అనుసరించి అక్కడ పూజలు చేయడం ప్రారంభించారు. ఒక సాధారణ మానవుడు అక్కడ దేవతలు శివ లింగాన్ని పూజించే అద్భుత దృశ్యాన్ని చూసి స్థానిక రాజు అయిన కులశేఖర పాండ్యకు తెలియజేశాడు.

పాండ్య రాజు వారసుడి కోసం యాగం చేసాడు. ఆ యాగ ఫలితంగా అతనికి మూడు రొమ్ములతో మీనాక్షి అనే కుమార్తె జన్మించింది. ఆ పసిపాపని చూసి చింతిస్తున్న రాజుతో దేవతలు చింతించవద్దని, మీనాక్షిని కొడుకులాగా, ధైర్య యోధురాలిగా పెంచమని, ఆమె పెరిగి పెద్దయ్యాక ఆమెకు తగిన పురుషుని కలుసుకున్నప్పుడు, ఆమె మూడవ రొమ్ము అదృశ్యమవుతుందని చెప్పారు. మీనాక్షి అనేక యుద్ధాలలో ప్రతిభను నిరూపించుకుంది. అన్ని దిశలలో రాజ్యాలను జయించింది. అయితే, ఆమె ఉత్తరాన రాజ్య విస్తరణ చేయాలని సంకల్పించినప్పుడు, హిమాలయాలలో కైలాస పర్వతంపై నివసించే శివుడు ఆమెకు ఎదురుపడ్డాడు. అతడ్ని చూడగానే ఆమె రొమ్ము ఒకటి రాలిపోయింది.

సాక్షాత్తు ఆ శ్రీ విష్ణువు మీనాక్షి సోదరుడి రూపంలో శివుడు మరియు మీనాక్షి అమ్మవార్ల వివాహానికి అధ్యక్షత వహించాడు. వారిద్దరూ మధురైలో తమ నివాసం ఏర్పాటు చేసుకుని పరిపాలిస్తున్నారని ప్రజల నమ్మకం. మదురైలోని ఈ ఆలయం 7వ శతాబ్దంలో నిర్మించబడింది, అయితే ఈరోజు మనం చూస్తున్న ఆలయం ఎక్కువగా 16 మరియు 17వ శతాబ్దాలలో నాయక్ రాజవంశం అభివృద్ధి చేసింది. వాస్తు శాస్త్రం యొక్క పవిత్ర సంప్రదాయానికి అనుగుణంగా వారు ఆలయాన్ని విస్తరించారు. నాలుగు వైపులా మాడ వీధులను పునఃనిర్మాణం చేశారు.

ఆలయం యొక్క దక్షిణ భాగాన స్వర్ణ కలువల కోనేరు ఉంది. భక్తులు మీనాక్షి మరియు సుందరేశ్వర స్వామి వారల ఆలయంలోకి ప్రవేశించే ముందు ఇందులోనే స్నానం చేస్తారు. ఆలయం యొక్క ఈశాన్య మూలలో వేయి స్తంభాల మందిరం, విశాలమైన మండపం ఉన్నాయి. వేయి స్తంభాల మండపం అని పిలిచినా వాస్తవానికి అక్కడ 985 స్తంభాలు మాత్రమే ఉన్నాయి. ఈ స్తంభాలు దేవతలు, రాక్షసులు మరియు దైవిక జంతువులను వర్ణించే శిల్పాలతో చెక్కబడి ఉండటంతో విశేషంగా ఆకట్టుకుంటుంది. దీనిని నృత్యం మరియు సంగీత ప్రదర్శనల కోసం ఉపయోగిస్తారు.

గోపురం అనే పదం తమిళ పదాలైన కో అంటే "రాజు" మరియు పురం అంటే "ద్వారం" నుండి ఉద్భవించాయి. సంస్కృతం నుండి గో అంటే "ఆవు" మరియు పురం అంటే "పట్టణం" అనే అర్థం కూడా వస్తుంది. ఇక్కడ, పద్నాలుగు గోపురాలు ఉంటాయి. ఇవి మీనాక్షి సుందరేశ్వరాలయం ప్రాకారం చుట్టూ ఉన్నాయి. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ గోపురాలకు, శిల్పాలకు మరమ్మత్తులు చేస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో రెండు ప్రధాన ఆలయాలుంటాయి. అవి సుందరమైన దేవుడిగా కొలిచే సుందరీశ్వరుని ఆలయం, మరొకటి మీనాక్షి అమ్మవారు కొలువైన ఆలయం. ఎనిమిది ప్రవేశ ద్వారాలతో ఈ ఆలయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. వీటిలో ఒక్కో ద్వారం దాదాపు 200 మీటర్ల ఎత్తుంటుంది. ప్రతి ద్వారం మీద ఉన్న కొన్ని వందల శిల్పాలు పర్యాటకులను ఎంతగానో పరవశింపజేస్తాయి. మీనాక్షి ఆలయ సముదాయంలో దాదాపు 33 వేలకు పైగా శిల్పాలున్నట్టు అంచనా.

అమ్మవారి కన్నుల్ని చేపలతో పోల్చడానిక్కూడ ఓ విశేషం ఉంది. లోకంలో ఉన్న మిగిలిన అన్ని ప్రాణులు తమ పిల్లలకి పాలు ఇవ్వడం ద్వారానే పెంచగలుగుతాయి. చేపజాతి మాత్రం అలా కాదు. తన పిల్లల్ని తానొక్కమారు అలా చూస్తే చాలు పిల్లల కడుపులు నిండుతాయి. దీన్ని బట్టి తెలిసేదేమంటే, అమ్మ మీన +అక్షి- చేపలవంటి కన్నులు కలది కాబట్టి మనం అమ్మని దర్శించినప్పుడు అమ్మ కన్నుల్లో మన కళ్లని అలా ఒకసారి ప్రసరింపచేసి చూస్తే చాలు అమ్మ కనుదృష్టి మన మీద పడి మన కుటుంబాలన్నీ చక్కగా పోషింపబడతాయని. అమ్మకి ‘మీనాక్షి’ అనే పేరు ఇందుకే వచ్చింది.

పంచశత శక్తిపీఠాల్లో మధురమీనాక్షి ఆలయ పీఠము ప్రముఖమైనది. మీనములవంటి చక్కని విశాలనేత్రాలతో ఒకేఒక మరకతశిలతో అమ్మవారి విగ్రహము చెక్కబడినది. ఆకుపచ్చ, నీలం కలగలిపిన మరకతమణి శరీరకాంతి ఆ తల్లి యొక్క ప్రత్యేకత. మధురను పాలించే పాండ్యరాజులంతా ఆ తల్లిని ఆడపడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తారు. దేవీ భాగవతపురాణము లో మణిద్వీపవర్ణనలా ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు.

రచయిత: కాపెర్ల పవన్ కుమార్

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 

యాత్రా తరంగిణి - దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలిదర్శనం చేసుకునే సమయం లో చేయవలసినది ఏమిటిప్రముఖ దేవాలయాల ప్రాముఖ్యతవిశిష్టతవిశేషాలు... వారం వారం మీకోసం... 

యాత్రా తరంగిణి 16: రాముడి పాపాలను ప్రక్షాళన చేసిన లింగం! రామేశ్వర క్షేత్రం యొక్క విశేషాలు! 

యాత్రా తరంగిణి 15: కోటానుకోట్ల విలువచేసే పసిడి, వజ్ర, వైఢూర్యాలు! అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యాలు! 

యాత్రా తరంగిణి 14: 41 రోజులు కఠిన దీక్ష! మకర జ్యోతి దర్శనం! ఎంతో ప్రసిద్ధి చెందిన శబరిమల క్షేత్రం! 

యాత్రా తరంగిణి 13: హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా భావించే శబరిమల - ఎరుమేలి శ్రీ ధర్మ శాస్తా ఆలయం! అసలు కథ ఏమిటి?

యాత్రా తరంగిణి 12: బృహస్పతి, వాయుదేవుడు కలిసి ప్రతిష్టించిన చిన్ని కృష్ణుడి విగ్రహం! గురువాయూర్‌ ఆలయ ప్రత్యేకతలు!

యాత్రా తరంగిణి 11: కుబేరుడు పతిష్టించిన లింగం! బంగారు ఊయల! ఎన్నో విశిష్టతలు! భవానీ ఆలయం! 

యాత్రా తరంగిణి 10: దగ దగా మెరిసిపోయే కాంతులతో మహాలక్ష్మి అమ్మవారు! వేలూరు గోల్డెన్ టెంపుల్
 

యాత్రా తరంగిణి 9: వేల ఏళ్ళ చరిత్ర ఉన్న కాణిపాక క్షేత్రం! విశేషాలు! పూజా విధానాలు!

యాత్ర తరంగిణి 8: దేవాలయాలకు రాతి గడప ఎందుకు ఉంటుంది! ఆ గడపను తొక్కవచ్చా? ప్రదక్షణం వెనకున్న పరమార్ధం!

యాత్ర తరంగిణి 7: ఆలయం లోపల భాగంలో ఉండే ప్రదేశాలు! వాటి విశిష్టత!

యాత్ర తరంగిణి 6: దేవాలయాల ఎప్పుడుఎక్కడ ప్రతీష్టించాలిశాస్త్రం ఏం చెబుతుంది?

యాత్రా తరంగిణి 5: ప్రతి దేవాలయం ఎందుకు అలా ఉంటుందిసైన్స్ దాగుందా?

యాత్రా తరంగిణి 4: దేవాలయాల నిర్మాణం వెనుక ఉన్న అసలు కారణం

యాత్ర తరంగణి 3: దేవాలయం లోపల పాటించవలసిన కనీస నియమ నిబంధనలు

యాత్ర తరంగణి 2: దేవాలయాలు ఎన్ని రకాలువాటి నిర్మాణాలు ఎలా ఉంటాయిఉపయోగాలు ఏమిటి...

యాత్రా తరంగిణి 1 -గుడి లో సాష్టాంగ నమస్కారంప్రదక్షిణం తప్పనిసరా... 

Spotlight

Read More →