మీడియా మొఘల్, పద్మవిభూషణ్ రామోజీరావు గారి అస్తమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
శ్రీ రామోజీరావు తెలుగు వెలుగు....ఆయన మృతి తీరని లోటు:- నారా చంద్రబాబు నాయుడు
అమరావతి:- ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చంద్రబాబు అన్నారు. అక్షర యోధుడుగా పేరున్న శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని...కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని చంద్రబాబు అన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన శ్రీ రామోజీ తెలుగు ప్రజల ఆస్తి అని....ఆయన మరణం రాష్ట్రానికే కాదు...దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం అని చంద్రబాబు అన్నారు. ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారని అన్నారు. మీడియా రంగంలో శ్రీ రామోజీ గారిది ప్రత్యేకమైన శకం అని చంద్రబాబు కొనియాడారు. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి...ఎక్కడా తలవంచకుండా శ్రీ రామోజీ గారు విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం అన్నారు. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం శ్రీ రామోజీరావు పనిచేశారని అన్నారు. మీడియా రంగంలో ఆయనొక శిఖరమని, ఆయన ఇక లేరు అనే విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
శ్రీరామోజీరావుతో తనుకు ఉన్న 4 దశాబ్దాల అనుబంధాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు... తనను ఆయనకు ఎంతో దగ్గర చేసిందని అన్నారు. సమస్యలపై పోరాటంలో ఆయన తను ఒక స్ఫూర్తి అని కొనియాడారు. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో శ్రీరామోజీ సూచనలు, సలహాలు తాను తీసుకునేవాడినని గుర్తుచేసుకున్నారు. శ్రీ రామోజీ అస్తమయంపై కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు ప్రార్థించారు.
ఇవి కూడా చదవండి:
ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మంత్రివర్గం ఏర్పాటుపై వార్తలు! ఆ శాఖలు వారికేనా!
ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నీరు-చెట్టు రైతులను ఆదుకుంటాం! చంద్రబాబు హామీ!
ఒడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న గుట్కా నాని! చెప్పింది గుర్తుందా అంటున్న తెలుగు యువత!
ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి చేసిన పనులకు మూల్యం చెల్లించక తప్పదు! మెయిన్ గేట్ వద్ద టీడీపీ సంబరాలు!
మోడీపై పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం! భారత్ ఎవరికీ తలొగ్గదు!
2047 నాటికి భారత్ నంబర్ వన్ గా నిలుస్తుంది! చంద్రబాబు వ్యాఖ్యలు!
కీలక పదవులను కొరనున్న చంద్రబాబు! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త! అవి ఏంటి అంటే!
పదవులు శాశ్వతం కాదు, ఈ గెలుపుతో అత్యుత్సాహం వద్దు! ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం!
ఖతార్ లో తెలుగుదేశం పార్టీ విజయోత్సవ సంబరాలు! భారీగా హాజరైన పార్టీ శ్రేణులు, అభిమానులు!
ప్రజల్లో ఉత్కంఠ రేపుతున్న మోడీ సర్కార్! టీడీపీకి ఎన్ని శాఖలు ఇవ్వనున్నారు?
ఈ 5 సంవత్సరాలు జగన్ నిద్రపోయాడు అనడానికి మరొక ఉదాహరణ! రాష్ట్రంలో అల్లర్లపై ట్వీట్!
ఎలెక్షన్లలో గెలిచిన ఆడుదాం ఆంధ్ర టీంతో జగన్ భేటీ! అంతకుమించి ఇంకేం చేయగలరులే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: