ఏపీ ప్రజలకు ఏపీఎస్‌డీఎంఏ అలెర్ట్.. 17 జిల్లాలకు వర్షాల హెచ్చరిక! రానున్న రోజుల్లో...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి శుభవార్త అందించారు. ఉద్యోగులకు ఒక నెల కరువు భత్యం (డీఏ) పెంచుతున్నట్లు కీలక ప్రకటన చేశారు. పెంచిన డీఏను నవంబర్ 1వ తేదీ నుంచి వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు. 

CMAT: మేనేజ్‌మెంట్ కోర్సుల ప్రవేశానికి కీలక పరీక్ష..! సీమ్యాట్ 2026 నోటిఫికేషన్ విడుదల..!

ఉండవల్లిలోని తన నివాసంలో ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులతో సమావేశమైన అనంతరం సీఎం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర చాలా కీలకమని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. 

భారతీయులకు షాక్.. గ్రీన్ కార్డ్ ఆశలపై నీళ్లు.! సులభంగా అమెరికా వెళ్లే మార్గం మూసేసిన ట్రంప్ సర్కార్!

తాజా డీఏ పెంపు నిర్ణయంతో ప్రభుత్వంపై ప్రతి నెలా రూ. 160 కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని, అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. "ఉద్యోగులంతా సంతోషంగా దీపావళి జరుపుకోవాలి. ఈ ఉత్సాహంతో రేపటి నుంచి మరింత బాగా పనిచేస్తారని ఆశిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశంలో కేవలం డీఏ పెంపు మాత్రమే కాకుండా పలు ఇతర అంశాలపై కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంది. పోలీసు సిబ్బందికి సంబంధించిన ఈఎల్ బకాయిల్లో మొదటి విడతగా రూ. 105 కోట్లను తక్షణమే విడుదల చేస్తామని, మిగిలిన మొత్తాన్ని జనవరిలో చెల్లిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అలాగే, ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సింగిల్ ప్రమోషన్‌ను దీపావళి కంటే ముందే పూర్తి చేస్తామని ప్రకటించారు.

ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించిన వ్యవస్థలను 60 రోజుల్లో క్రమబద్ధీకరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సీపీఎస్ రద్దు, పీఆర్‌సీ అమలు వంటి కీలక అంశాలపై త్వరలోనే చర్చించి పరిష్కరిస్తామని, ఈ విషయాల్లో ఎలాంటి దాపరికం లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తామని ఉద్యోగ సంఘాలకు భరోసా ఇచ్చారు. 

Digital Future: డెబిట్, క్రెడిట్ కార్డుల యుగం ముగింపు..! భవిష్యత్తు చెల్లింపులు స్మార్ట్ వాచ్‌లలోనే..!

సంపద సృష్టిలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సీఎం, ఉద్యోగుల సహకారంతో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

రెజీనా కసాంద్రా రాత్రి దాని కోసం ఇంత పెద్ద అబద్ధం చెప్పిందా?
Singapore Trip: ఇప్పుడు కేవలం రూ.9 వేలకే సింగపూర్ వెళ్లిరావచ్చు! ఎలా అనుకుంటున్నారా!
Delhi Blaze: బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో మంటలు..! రాజ్యసభ, లోక్‌సభ ఎంపీల నివాసాల్లో కలకలం..!
Gold Rates: పసిడి ప్రియులకి గుడ్ న్యూస్..! భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంత అంటే..!
7,267 ఖాళీలకు టీచింగ్ & నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ దరఖాస్తు సంబంధించిన పూర్తి వివరాలు!!
Air China: గాల్లోనే లగేజీ దగ్ధం.. ఎయిర్ చైనా విమానంలో కలకలం..! లిథియం బ్యాటరీ పేలడంతో..!
రామ్మోహన్ నాయుడు.. స్వచ్ఛత, సైకిల్, టెక్ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు!!
ఓటీటీలోకి రూ.300 కోట్ల సంచలనం.. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
రుషికొండ భవనాలకు దిశానిర్దేశం.. 4 రకాలుగా వాడుకోవచ్చు! ఛాన్స్ ఇమ్మన్న స్టార్ హోటల్స్..!
ఏపీలో రైలు ప్రయాణికులకు ఎగిరి గంతేసే వార్త.. ఆ రెండు ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్ల అక్కడా ఆగుతాయి..
ప్రపంచంలోనే పొడవైన రైల్వే స్టేషన్ — గిన్నిస్‌ రికార్డులో స్థానం… అది ఎక్కడంటే?