నిజమాబాద్ జిల్లా భీంగల్ మండలం సిద్దపల్లి - బెజ్జోర గ్రామానికి చెందిన బోజ సురేష్ (42), 2025 ఆగస్ట్ 20న హైదరాబాద్ నుండి మస్కట్ కు వెళ్లడం జరిగింది. ఆయనకు మెడికల్ క్లీనర్గా పని అని చెప్పి ఏజెంటు అగ్రికల్చరల్ వర్కర్’ వీసాతో ఓమాన్ దేశానికి వెళ్లడం జరిగినది.
సురేష్ చెప్పిన వివరాల ప్రకారం, నెలకు 120 రియాళ్ల జీతం, ఉచిత భోజనం ఉంటాయని ఏజెంట్ చెప్పినప్పటికీ, వాస్తవం తారుమారైనది. మస్కట్కి 250 కి.మీ. దూరంలో ఉన్న యాంకిల్ పట్టణం సమీపంలోని గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో ప్రతి రెండు గంటలకు గడ్డి కోసే పని ఎడారి వాతావరణం అధిక ఒత్తిడి కారణంగా సురేష్ శారీరకంగా మరియు మానసిక ఒత్తిడికి గురవుతున్నానని తెలిపారు.
అయితే సురేష్ కుటుంబ పరిస్థితులు మరింత ఇబ్బందిగా మారిందని ఇటీవల తన తల్లి మరణించగా, భార్య అనారోగ్యంతో బాధపడుతున్నారని, తను ఎలాగైనా స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. ఈ సమస్య పరిష్కారం కోసం సురేష్ కూతురు తేజశ్రీ నిన్న (శుక్రవారం 17.10.2025) హైదరాబాద్లోని సీఎం ప్రవాసీ ప్రజావాణి కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కు వినతిపత్రం సమర్పించారు.
వినతిపత్రంలో, రూ.90 వేలు తీసుకుని వేరే పనికి పంపించిన ఏజెంట్పై తగిన చర్యలు తీసుకోవాలని, అలానే తన తండ్రిని ఓమాన్ ఎడారి నుంచి రక్షించి, స్వదేశానికి తీసుకురావాలని తేజశ్రీ కోరారు. ఈ సందర్భంలో ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సురేంద్రనాథ్, ప్రజావాణి సిబ్బంది జగదీశ్ పటేల్, టాంకాం ప్రతినిధి పవన్ తేజశ్రీకు మార్గదర్శనం చేసి, భరోసా ఇచ్చారు.
ఓమాన్ వంటి గల్ఫ్ దేశాలలో ఎగ్జిక్యూట్ అయ్యే వీసా మోసాలు వర్క్ అబ్యూస్ సమస్యలను ఈ సంఘటన ద్వారా పూర్తిగా తెలుసుకోవాలి. మరి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏజెంట్లు చేసే మోసాలను తెలుసుకొని పూర్తి సమాచారం తెలిస్తేనే ఇతర దేశాలలో పని కోసం వెళ్లాలి లేదంటే కుటుంబాలు అదేవిధంగా పని కోసం వెళ్ళిన వారు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాలను ఇటువంటి వార్తల ద్వారా తెలుసుకుంటున్నామని దీనిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని కాగా ప్రస్తుతం ప్రభుత్వం ఈ కేసుపై పరిశీలనలు చేపట్టినట్లు, తగిన చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు.