Tiger Fear: కాకినాడ జిల్లాలో పులి కలకలం... శంఖవరం, ప్రత్తిపాడు సరిహద్దుల్లో హై అలర్ట్! Tiger hunting: మళ్లీ మొదలైన పులి వేట! భయంతో వణుకుతున్న ఆ గ్రామాలు! Oar Fish: 3,000 అడుగుల లోతు నుండి తీరానికి చేరిన ఓర్ ఫిష్..! శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? Weather Update: విపత్తుల సంస్థ హెచ్చరిక! మార్చి నుంచే భానుడి భగభగలు...! ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత తీవ్రం! Summer Tips: మండిపోతున్న ఎండలు..! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! AP Weather: ఏపీ వాతావరణ హెచ్చరిక... మార్చి 7 నుంచి కోస్తాంధ్రలో వర్షాలు! Earthquake: గజగజలాడిన ఉత్తర తెలంగాణ... రిక్టర్ స్కేలుపై 3.9 తీవ్రత! Air Quality: గాలి నాణ్యతలో భారీ క్షీణత! మంచు కాదు.. అది కాలుష్యపు పొగ.. అధికారుల హెచ్చరిక! Earthquake: ఆ రెండు నగరాలకు భూకంప ముప్పు.. ఐఐటీ పరిశోధనలో షాకింగ్ నిజాలు! Rain Alert: ఏపీలో వాతావరణ మార్పులు! ఒకవైపు భానుడి భగభగలు.. మరోవైపు అల్పపీడన జల్లులు! Tiger Fear: కాకినాడ జిల్లాలో పులి కలకలం... శంఖవరం, ప్రత్తిపాడు సరిహద్దుల్లో హై అలర్ట్! Tiger hunting: మళ్లీ మొదలైన పులి వేట! భయంతో వణుకుతున్న ఆ గ్రామాలు! Oar Fish: 3,000 అడుగుల లోతు నుండి తీరానికి చేరిన ఓర్ ఫిష్..! శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? Weather Update: విపత్తుల సంస్థ హెచ్చరిక! మార్చి నుంచే భానుడి భగభగలు...! ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత తీవ్రం! Summer Tips: మండిపోతున్న ఎండలు..! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! AP Weather: ఏపీ వాతావరణ హెచ్చరిక... మార్చి 7 నుంచి కోస్తాంధ్రలో వర్షాలు! Earthquake: గజగజలాడిన ఉత్తర తెలంగాణ... రిక్టర్ స్కేలుపై 3.9 తీవ్రత! Air Quality: గాలి నాణ్యతలో భారీ క్షీణత! మంచు కాదు.. అది కాలుష్యపు పొగ.. అధికారుల హెచ్చరిక! Earthquake: ఆ రెండు నగరాలకు భూకంప ముప్పు.. ఐఐటీ పరిశోధనలో షాకింగ్ నిజాలు! Rain Alert: ఏపీలో వాతావరణ మార్పులు! ఒకవైపు భానుడి భగభగలు.. మరోవైపు అల్పపీడన జల్లులు!

World Wildlife Day: అటవీ శాఖ చరిత్రలో కొత్త అధ్యాయం.. వన్యప్రాణుల రక్షణపై పవన్ కల్యాణ్ క్లారిటీ...!

AP Wildlife Protection Project: మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ వేదికగా జరిగిన ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఏనుగుల దాడి నుంచి రైతులను కాపాడేందుకు, అటవీ సరిహద్దు గ్రామాల్లో ప్రత్యేక అలర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వన్యప్రాణులు-మనుషుల మధ్య సంఘర్షణ తగ్గించడమే ఈ కొత్త ప్రాజెక్ట్ లక్ష్యమని వివరించారు.

Published : 2026-03-03 10:54:00

AP Wildlife Protection Project: ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ చరిత్రలో ఈరోజు ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో నిర్వహించిన ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పర్యావరణ వేత్తలకు, జంతు ప్రేమికులకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో వన్యప్రాణుల పాత్ర ఎంతో కీలకమని, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు.

వన్యప్రాణులు  మనుషుల మధ్య పెరుగుతున్న సంఘర్షణను  తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను చేపట్టిందని పవన్ కల్యాణ్ వివరించారు. అడవి నుంచి జంతువులు జనావాసాల్లోకి రాకుండా చూడటం, అదే సమయంలో మనుషుల నుంచి వన్యప్రాణులకు ముప్పు కలగకుండా జాగ్రత్త పడటం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని ఆయన  చెప్పుకొచ్చారు. వన్యప్రాణుల రక్షణ కేవలం అటవీ శాఖ పని మాత్రమే కాదని, సామాన్య ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా రాష్ట్రంలో రైతులను వేధిస్తున్న ఏనుగుల సమస్యపై పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. చిత్తూరు జిల్లాతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఏనుగుల వల్ల పంటలు దెబ్బతింటున్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా అటవీ సరిహద్దుల్లో అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నామని తెలిపారు. ఏనుగులు అడవి దాటి బయటకు వస్తున్నప్పుడు రైతులను ముందే అప్రమత్తం చేసేందుకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.

అటవీ సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్లో అలర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జంతువులు పొలాల్లోకి గానీ, గ్రామాల వైపు గానీ వస్తున్నప్పుడు సెన్సార్ల ద్వారా లేదా మొబైల్ మెసేజ్‌ల ద్వారా గ్రామస్తులను అలర్ట్ చేసే ప్రక్రియను మరింత బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల అటు జంతువులకు, ఇటు ప్రజలకు సురక్షితమైన వాతావరణం కలుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

చివరగా, అటవీ శాఖ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. అడవుల విస్తీర్ణం పెంచేందుకు, వన్యప్రాణుల సంఖ్యను వృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేయాలని కోరారు. గతంలో కంటే భిన్నంగా, అత్యాధునిక పరికరాలు  పటిష్టమైన నిఘా వ్యవస్థతో అటవీ సంపదను కాపాడుకుంటామని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.

Spotlight

Read More →