ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న పునరుత్పాదక శక్తి సంస్థలలో ఒకటైన మస్దార్ సీఈఓ మోహమ్మద్ జమీల్ అల్ రమాహీ భేటీ అవ్వడం జరిగినది. ఈ సందర్భంగా గ్రీన్ ఎనర్జీ రంగంలో రెండు సంస్థల మధ్య భాగస్వామ్య అవకాశాలపై చర్చలు జరిగాయి.
సీఎం చంద్రబాబు నాయుడు ఈ భేటీ వివరాలను తన సోషల్ మీడియా వేదిక Xలో పంచుకున్నారు. మస్దార్ సీఈఓ మోహమ్మద్ జమీల్ అల్ రమాహీని కలవడం ఆనందంగా అనిపించింది. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న పునరుత్పాదక శక్తి కంపెనీలలో మస్దార్ ఒకటి. ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో ముందంజలో ఉంది. పునరుత్పాదక, సుస్థిర శక్తి కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నాం. స్వచ్ఛశక్తి భాగస్వామ్యాలను బలోపేతం చేసే మార్గాలపై చర్చించాం. గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తు కోసం కలిసి పని చేయాలనే దిశగా ముందుకు సాగుతాం అని ఆయన పేర్కొన్నారు.
దుబాయ్ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, ముబదాల ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, మరియు అనేక గ్లోబల్ ఎనర్జీ సంస్థల ప్రతినిధులతో కూడా ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, గ్రీన్ ఎనర్జీ హబ్గా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసే ప్రణాళికలపై చర్చలు జరిగాయి.
చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎనర్జీ రంగానికి అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులను ఆకర్షించే దిశగా చురుకైన చర్యలు అని చెప్పడంలో అతిశయక్తే లేదు.