కొత్త భయం.. తండ్రికి కరోనా సోకితే.. పుట్టబోయే పిల్లలపై తీవ్ర ప్రభావం.! ప్రజారోగ్యానికి పెను సవాల్!

ఆంధ్రప్రదేశ్‌లోని బాలయోగి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులకు ఏపీ హైకోర్టు కీలకమైన తాత్కాలిక ఊరట కల్పించింది. ఈ ఉపాధ్యాయులను విధులనుంచి తొలగించరాదని, తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వారికి ఉద్యోగాల్లో ఎటువంటి ఆటంకం కలగకూడదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును న్యాయమూర్తి న్యాపతి విజయ్ విచారించి, సంబంధిత అధికారులకు నోటీసులు పంపించారు.

ISRO విజయం సూర్యుడి నుండి వచ్చే ఉద్గారాల (CME) రహస్యాన్ని ఛేదించిన చంద్రయాన్-2!

వివిధ జిల్లాలకు చెందిన 24 మంది పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. 2009 నుండి నిరంతరంగా సేవలందిస్తున్నప్పటికీ, ప్రభుత్వం తమ సేవలను క్రమబద్ధీకరించకపోవడమే కాకుండా ఇటీవల అధికారులు విధులకు హాజరుకావద్దని మౌఖికంగా ఆదేశించారని వారు కోర్టులో వాదించారు. తమ సేవలను గుర్తించి శాశ్వత ఉద్యోగులుగా మార్చాలని పిటిషనర్లు కోరారు. ఈ నేపథ్యంలో, కోర్టు సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి, పలు జిల్లాల కోఆర్డినేటర్లు, ప్రిన్సిపాళ్లకు నోటీసులు జారీ చేసింది.

Nitish: తెలుగు యువ ఆటగాడికి క్రికెట్ కెరీర్‌లో మరో గోల్డెన్ మూమెంట్.. ఇక ఆల్ ఫార్మాట్ ప్లేయర్!

పిటిషనర్ల తరఫున న్యాయవాది కర్రా మాధవి వాదనలు వినిపిస్తూ, “హైకోర్టు ఇప్పటికే ఈ సంవత్సరం ఫిబ్రవరి 12న ప్రభుత్వం పిటిషనర్ల సేవలను క్రమబద్ధీకరించాలన్న ఆదేశాలు ఇచ్చింది. కానీ అధికారులు వాటిని పట్టించుకోలేదు. పైగా విధులకు హాజరుకావొద్దని మౌఖిక ఆదేశాలు ఇవ్వడం చట్ట విరుద్ధం” అని పేర్కొన్నారు. మరోవైపు, ప్రభుత్వ తరఫున స్టాండింగ్ కౌన్సెల్ రవికుమార్ మరియు ప్రభుత్వ సహాయ న్యాయవాది వాదిస్తూ, “పార్ట్‌టైమ్ టీచర్ల నియామకం కేవలం తాత్కాలిక ఏర్పాటుగా జరిగింది. వారిని కొనసాగించాలనే హక్కు పిటిషనర్లకు లేదు” అని తెలిపారు.

Australia Visit: మంత్రి నారా లోకేశ్‌కు సిడ్నీ విమానాశ్రయంలో ఘన స్వాగతం..! అధునాతన బోధనా పద్ధతులను..!

ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, తాత్కాలికంగా పిటిషనర్ల విధులకు ఎటువంటి ఆటంకం కలిగించరాదని ఆదేశిస్తూ, తదుపరి విచారణను నవంబర్ 17కి వాయిదా వేసింది. ఈ తీర్పుతో గత 16 ఏళ్లుగా తాత్కాలికంగా పనిచేస్తున్న గురుకుల పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులకు కొంత ఉపశమనం లభించింది. తమ సేవలను క్రమబద్ధీకరించే దిశగా ఈ ఆదేశాలు కీలక మలుపు తిప్పే అవకాశముందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు.

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మంచిర్యాలకు చెందిన తల్లీకూతుళ్లు దుర్మరణం! పుట్టినరోజు ఆనందం నిమిషాల్లోనే.!
Jobs: పోలీస్ విభాగాల్లో భారీ నియామకాలు..! 20,000 పైగా పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం!
వాతావరణ శాఖ హెచ్చరిక – ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!!
TTD: శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం.. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు!
ఐటీ ఉద్యోగులకు AI ఆటోమేషన్ భవిష్యత్తులో సవాళ్లు పెంచనుందా?
Amaravati ORR: అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..! 12 ప్యాకేజీల ప్రాజెక్ట్, భూసేకరణ త్వరలో..!