Prathipadu: ప్రత్తిపాడులో పులి కలకలం! ఆ సరిహద్దు గ్రామాల్లో హై అలర్ట్! Amaravathi: అమరావతిలో అభివృద్ధి పరుగులు... వాటికి భారీ భూ కేటాయింపులు! Nara Lokesh: మైలవరం స్కూల్‌లో లోకేష్ తనిఖీ! ప్రధానోపాధ్యాయుడు జాన్ సస్పెన్షన్... Chandrababu: చంద్రబాబు భద్రతా బృందానికి అరుదైన సత్కారం! సీఎస్ఓ కు ‘మహోన్నత సేవా పతకం’!కాన్వాయ్ డ్రైవర్ కు ఉత్తమ సేవా పతకం. Chandrababu: ఏపీలో 14 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు... ముఖ్యమంత్రి కీలక ప్రకటన..! YSRCP: రేపల్లెలో వైసీపీ ఇన్ ఛార్జ్ హల్ చల్... సీఐ అంతు చూస్తానంటూ వార్నింగ్! Land Irregularities: పల్నాడు జిల్లాలో భూ అక్రమాలపై సర్కార్ వేటు.. కీలక ఆదేశాలు జారీ! Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రులతో కీలక భేటీ! AP Government: ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్... వడ్డీలో 50% రాయితీ! త్వరపడండి... Chandrababu: ఇమామ్, మౌజమ్‌లకు గుడ్ న్యూస్! నేటి రాత్రి లోపే బకాయిల విడుదల... సీఎం ఆదేశాలు! Prathipadu: ప్రత్తిపాడులో పులి కలకలం! ఆ సరిహద్దు గ్రామాల్లో హై అలర్ట్! Amaravathi: అమరావతిలో అభివృద్ధి పరుగులు... వాటికి భారీ భూ కేటాయింపులు! Nara Lokesh: మైలవరం స్కూల్‌లో లోకేష్ తనిఖీ! ప్రధానోపాధ్యాయుడు జాన్ సస్పెన్షన్... Chandrababu: చంద్రబాబు భద్రతా బృందానికి అరుదైన సత్కారం! సీఎస్ఓ కు ‘మహోన్నత సేవా పతకం’!కాన్వాయ్ డ్రైవర్ కు ఉత్తమ సేవా పతకం. Chandrababu: ఏపీలో 14 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు... ముఖ్యమంత్రి కీలక ప్రకటన..! YSRCP: రేపల్లెలో వైసీపీ ఇన్ ఛార్జ్ హల్ చల్... సీఐ అంతు చూస్తానంటూ వార్నింగ్! Land Irregularities: పల్నాడు జిల్లాలో భూ అక్రమాలపై సర్కార్ వేటు.. కీలక ఆదేశాలు జారీ! Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రులతో కీలక భేటీ! AP Government: ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్... వడ్డీలో 50% రాయితీ! త్వరపడండి... Chandrababu: ఇమామ్, మౌజమ్‌లకు గుడ్ న్యూస్! నేటి రాత్రి లోపే బకాయిల విడుదల... సీఎం ఆదేశాలు!

Veeranjaneya Swamy: పెండింగ్ బకాయిలు రూ.45 కోట్లు విడుదల చేశాం.. రంజాన్ మాసం సందర్భంగా.. మంత్రి బాల వీరాంజనేయస్వామి!

Veeranjaneya Swamy: ముస్లిం మైనారిటీల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

Published : 2026-03-17 21:30:00
  • ముస్లిం మైనారిటీల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత..
     
  • రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఈ ఏడాది బడ్జెట్లో ముస్లింల సంక్షేమానికి రూ. 6,090 కోట్లు కేటాయించాం…

Andhrapradesh Veeranjaneya Swamy: ముస్లిం మైనారిటీల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా మంగళవారం సింగరాయకొండలో ఇఫ్తార్ విందులో మంత్రి డా.స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి మంత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.  అనంతరం  మంత్రి స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ...ముస్లిం మైనారిటీల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఈ ఏడాది బడ్జెట్లో ముస్లింల సంక్షేమానికి రూ. 6,090 కోట్లు కేటాయించాం. ఇమామ్‌లు, మౌజామ్‌లకు గౌరవ వేతనాలు పెండింగ్ బకాయిలు రూ.45 కోట్లు నేడు విడుదల చేశాం. ఉర్దూ ఘర్, షాదీఖానాల నిర్మాణాలకు రూ. 2.85 కోట్లు మంజూరు చేశాం. అమరావతిలో హజ్ హౌస్ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. వక్స్ బోర్డు  ఆస్తుల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాం. హజ్ యాత్రకు వెళ్ళే పేద ముస్లింలకు ఆర్థిక సాయం అందిస్తున్నాం. ముస్లిం మైనార్టీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాల అండగా ఉన్నారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

Spotlight

Read More →