Bullet Train: ఏపీకి బుల్లెట్ రైలు! కేవలం 2 గంటల్లోనే బెజవాడ టు వైజాగ్! Hostel Facilities: సాంఘిక సంక్షేమ శాఖపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ..! మౌలిక వసతులపై ఫోకస్! ORR: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ORR నుంచి RRR వరకు 10 కొత్త రేడియల్ రోడ్లు! Custodial Torture: రఘురామ కేసులో కీలక మలుపు..! విచారణకు ఐపీఎస్ సునీల్ నాయక్! Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. నేతలు ఎవరికి వారు అంటే కుదరదు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి- చంద్రబాబు! AP Electricity: ఏపీలో విద్యుత్ వెలుగులు! అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు! Indian Railways: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇక ఎయిర్‌పోర్ట్ రేంజ్..! స్కై వాక్ ద్వారా నిమిషాల్లో ప్రయాణం! Bihar Politics: బిహార్ రాజకీయాల్లో సంచలనం! నితీష్ కుమార్‌కు కేంద్రంలో కీలక పదవి? Praja Vedika: నేడు (05/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Sunil Nayak: నేడు పోలీసుల ముందుకు సునీల్ నాయక్... RRR కేసులో కీలక విచారణ! Bullet Train: ఏపీకి బుల్లెట్ రైలు! కేవలం 2 గంటల్లోనే బెజవాడ టు వైజాగ్! Hostel Facilities: సాంఘిక సంక్షేమ శాఖపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ..! మౌలిక వసతులపై ఫోకస్! ORR: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ORR నుంచి RRR వరకు 10 కొత్త రేడియల్ రోడ్లు! Custodial Torture: రఘురామ కేసులో కీలక మలుపు..! విచారణకు ఐపీఎస్ సునీల్ నాయక్! Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. నేతలు ఎవరికి వారు అంటే కుదరదు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి- చంద్రబాబు! AP Electricity: ఏపీలో విద్యుత్ వెలుగులు! అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు! Indian Railways: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇక ఎయిర్‌పోర్ట్ రేంజ్..! స్కై వాక్ ద్వారా నిమిషాల్లో ప్రయాణం! Bihar Politics: బిహార్ రాజకీయాల్లో సంచలనం! నితీష్ కుమార్‌కు కేంద్రంలో కీలక పదవి? Praja Vedika: నేడు (05/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Sunil Nayak: నేడు పోలీసుల ముందుకు సునీల్ నాయక్... RRR కేసులో కీలక విచారణ!

AP NRT: నవ్యాంధ్ర నిర్మాణంలో కీలక ఘట్టం.. ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా కోమటి జయరాం బాధ్యతల స్వీకారం.!

Representative North America Komati Jayaram: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రులను క్రియాశీల భాగస్వాములను చేస్తూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా శ్రీ కోమటి జయరాం గారు ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

Published : 2026-03-05 14:16:00
  • నవ్యాంధ్ర నిర్మాణంలో ప్రవాసాంధ్రుల పాత్ర: ఉత్తర అమెరికా ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా కోమటి జయరాం బాధ్యతల స్వీకరణ!
     
  • అమెరికా ఎన్నారైలకు కొండంత అండ: ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జయరాం అపూర్వ ఘట్టం..

Representative North America Komati Jayaram: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రులను క్రియాశీల భాగస్వాములను చేస్తూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా శ్రీ కోమటి జయరాం గారు ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిలోని ఏపీఎన్నార్టీ (APNRT) కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో, వేద పండితుల ఆశీర్వచనాల నడుమ ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ అపూర్వ ఘట్టానికి రాష్ట్ర ఎన్నారై శాఖామాత్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జయరాం గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆయనతో పాటు ఏపీ ఎన్నార్టీ అధ్యక్షులు శ్రీ వేమూరి రవి, సైన్స్ అండ్ టెక్నాలజీ చైర్మన్ శ్రీ రవి మండలపు, ప్రముఖ ఎన్నారై డాక్టర్ శ్రీ రాజా పిల్లి, టీడీపి ఎన్నారై ఇన్చార్జ్ రాజశేఖర్ గారు మరియు వివిధ దేశాల నుంచి తరలివచ్చిన ఎన్నారై ప్రతినిధులు జయరాం గారి నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ వేడుకలో పాలుపంచుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కోమటి జయరాం గారి నియామకం రాష్ట్రానికి ఒక శుభపరిణామమని కొనియాడారు. జయరాం గారు కేవలం ఒక ప్రతినిధి మాత్రమే కాదు, అమెరికాలో ఉన్న లక్షలాది మంది తెలుగు వారికి ఒక భరోసా అని, గతంలో ఆయన చేసిన సేవలు అమోఘమని మంత్రి ప్రశంసించారు. ముఖ్యంగా డిజిటల్ విద్య, మౌలిక సదుపాయాల కల్పనలో జయరాం గారు చూపిన చొరవ అభినందనీయమని, ఇప్పుడు మళ్ళీ ఆయన బాధ్యతలు చేపట్టడం వల్ల అమెరికా నుంచి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావడమే కాకుండా, అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు, ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా తక్షణ పరిష్కారం లభిస్తుందనే నమ్మకం తమకు ఉందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

గత ఐదేళ్ల అరాచక పాలన తర్వాత రాష్ట్రం చంద్రబాబు గారి నేతృత్వంలో 'జెట్ స్పీడ్'తో దూసుకుపోతోందని, ఈ క్రమంలో జయరాం గారి అనుభవం రాష్ట్రాభివృద్ధికి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం కోమటి జయరాం గారు మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదేళ్ల పాలనను అంతం చేయడంలో ఎన్నారై టీడీపి (NRI TDP) కార్యకర్తలు, నాయకులు చేసిన పోరాటం మరువలేనిదని గుర్తు చేస్తూ, ఇప్పుడు ప్రజా ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

గతంలో 2014-19 మధ్య సుమారు 3,500 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టడం, స్మశాన వాటికల అభివృద్ధి, అంగన్‌వాడీ భవనాల నిర్మాణంలో ఎన్నారైలను భాగస్వాములను చేసిన స్ఫూర్తితో, ఇప్పుడు అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని ప్రకటించారు. అమరావతి, పోలవరం పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని, గ్లోబల్ ఇన్వెస్టర్లు ఏపీ వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో, ప్రవాసాంధ్రులకు, ప్రభుత్వానికి మధ్య ఒక బలమైన సంధానకర్తగా వ్యవహరిస్తానని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ఎన్నార్టీ అధ్యక్షులు శ్రీ వేమూరి రవి మాట్లాడుతూ, జయరాం గారి రాక ప్రవాసాంధ్రులకు కొండంత అండ అని, గతంలో పాఠశాలల డిజిటలైజేషన్ వంటి కార్యక్రమాల్లో ఆయన సాధించిన విజయం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ చైర్మన్ శ్రీ రవి మండలపు మాట్లాడుతూ.. అమెరికాలోని సాంకేతిక నైపుణ్యాన్ని ఏపీకి మళ్ళించడంలో జయరాం గారి నెట్‌వర్క్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

అలాగే టీడీపి ఎన్నారై ఇన్చార్జ్ రాజశేఖర్ గారు మాట్లాడుతూ.. క్లిష్ట కాలంలో పార్టీ కార్యకర్తలను ఐక్యంగా ఉంచిన నాయకుడు జయరాం గారు అని, లోకేష్ గారి నాయకత్వంలో యువతను, సీనియర్లను సమన్వయం చేస్తూ రాష్ట్ర భవిష్యత్తును మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ ఎన్నారై డాక్టర్ శ్రీ రాజా పిల్లి మాట్లాడుతూ, వైద్య, సామాజిక సేవా రంగాల్లో ఎన్నారైలను భాగస్వాములను చేయడంలో జయరాం గారి నిస్వార్థ కృషి ప్రవాస భారతీయుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో.. చంద్ర కాజ, చందు గోటిపాటి, వెంకట్ కోగంటి, అనిల్ వీరపనేని, జితేంద్ర అతులూరి, మోహన్ ఎదర, వాసు కోనేరు, శ్రీకాంత్ దొడ్డపనేని, శ్రీనివాస్ గుత్తికొండ, ప్రశాంత్ పెనపనేని, వెంకట జెట్టి, ఆళ్ళ వెంకట్, రాజా పిల్లి అమెరికా దేశా ప్రముఖులు ఇతర దేశాల ఎన్నారై లు పాల్గొన్నారు. అంతిమంగా, ఒక పక్కా రోడ్ మ్యాప్‌తో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిలుపుతానని జయరాం గారు ఇచ్చిన హామీ నవ్యాంధ్ర నిర్మాణంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని హాజరైన ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

Spotlight

Read More →