Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు! AP New Highway: మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఎలివేటెడ్ కారిడార్ - ఆరు లైన్లు రోడ్డుగా విస్తరణ! Amaravati: అమరావతి సెకండ్ ఫేస్ మాస్టర్ ప్లాన్! మరో 50 గ్రామాలకు చోటు... Global Politics: ప్రపంచ రాజకీయాల్లో కొత్త మలుపు! ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా... Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు!

AP Govt Schemes: ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. వంట గ్యాస్ కనెక్షన్‌పై భారీ సబ్సిడీ!

AP Govt Schemes: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్యాస్ వినియోగదారుల కోసం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. పీఎన్‌జీ (PNG) కనెక్షన్ ఉన్నవారికి ఏడాదికి రూ. 2,400 సబ్సిడీని నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది.

Published : 2026-03-26 19:35:00

AP Govt Schemes: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సామాన్యులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు ఊరటనిచ్చేలా కొత్త పథకాన్ని పట్టాలెక్కించింది. ఇకపై వంట గ్యాస్ కోసం సిలిండర్ల చుట్టూ తిరిగే పని లేకుండా, నేరుగా పైపుల ద్వారా గ్యాస్ (PNG) తీసుకునే వారికి ఏటా రూ. 2,400 చొప్పున సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

సాధారణంగా ఎల్పీజీ సిలిండర్ల వాడకం వల్ల కొన్నిసార్లు కొరత ఏర్పడటం, బుకింగ్ చేసుకున్న తర్వాత డెలివరీ కోసం ఎదురుచూడటం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. వీటన్నిటికీ చెక్ పెడుతూ 'పైప్డ్ నేచురల్ గ్యాస్' (PNG) వాడకాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే వినియోగదారులకు ఆర్థిక భారం తగ్గించడానికి భారీ రాయితీని ప్రకటించింది. ఈ సబ్సిడీ సొమ్మును ప్రభుత్వం నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోకే (DBT) జమ చేయనుంది.

ఈ పథకంలో భాగంగా ఏడాదికి మొత్తం 2,400 రూపాయలు అందుతాయి. అయితే ఇది ఒకేసారి కాకుండా విడతల వారీగా జమ అవుతుంది. ప్రతి రెండు నెలలకు ఒకసారి రూ. 400 చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇలా ఏడాదిలో ఆరు విడతలుగా మీ అకౌంట్‌లో డబ్బులు పడతాయి. దీనివల్ల నెలవారీ గ్యాస్ ఖర్చు గణనీయంగా తగ్గుతుందని మధ్యతరగతి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎస్ సాయిప్రసాద్ ఈ పథకం వివరాలను వెల్లడించారు. ప్రతి జిల్లాలో కనీసం 10,000 పీఎన్‌జీ కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇళ్లకే కాకుండా హోటళ్లు, పరిశ్రమలకు కూడా ఈ సౌకర్యాన్ని విస్తరించనున్నారు. ఈ గ్యాస్ పంపిణీ వ్యవస్థను వేగవంతం చేసేందుకు 'ఏపీ సీజీడీ రైట్ ఆఫ్ వే రూల్స్-2026' పేరుతో కొత్త నిబంధనలను కూడా అమల్లోకి తెచ్చారు. కేవలం 24 గంటల్లోనే గ్యాస్ కనెక్షన్ అనుమతులు వచ్చేలా సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టడం విశేషం.

రాష్ట్రంలో అక్కడక్కడా వినిపిస్తున్న గ్యాస్ కొరత వార్తలపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. రాష్ట్రంలో ఎక్కడా సిలిండర్ల కొరత లేదని, ప్రజలు అనవసరంగా భయపడి స్టాక్ కోసం ముందే బుక్ చేసుకోవద్దని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఇంధన సంక్షోభం తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన భరోసా ఇచ్చారు.

Spotlight

Read More →