Trump: 1987లోనే ఇరాన్‌పై యుద్ధానికి ట్రంప్ స్కెచ్? వైరల్ అవుతున్న పాత పత్రికా కథనం! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం! AndhraPradesh: ఏపీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా... ఎందుకంటే! Ayush Centers: ఏపీలో ఆ ప్రాంతాల ప్రజలకు శుభవార్త! రూ.44 కోట్లతో 150 కేంద్రాలు... రెండు నెలల్లో అందుబాటులోకి... YCP: పార్లమెంటులో ఇంట్రెస్టింగ్ సీన్! చేదు జ్ఞాపకాలు వద్దు.. 11వ రూమ్ తాళం వద్దన్న వైసీపీ నేతలు! Jal Jeevan Mission 2.0: 2028 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి.. జేజేఎం 2.0పై కేంద్ర, ఏపీ సర్కార్ ఒప్పందం! PMAY Scheme: ఏపీలో పేదల ఇళ్లకు లైన్ క్లియర్.... పీఎంఏవై లబ్ధిదారుల తుది జాబితా! FCRA Renewal: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు... ఆర్‌డీటీకి గ్రీన్ సిగ్నల్! నిధుల కొరతకు ఇక చెక్! LPG Vessels: హర్మూజ్ జలసంధి వద్ద టెన్షన్... గల్ఫ్‌లో నిలిచిపోయిన ఆరు భారీ ఎల్‌పీజీ నౌకలు! Trump: 1987లోనే ఇరాన్‌పై యుద్ధానికి ట్రంప్ స్కెచ్? వైరల్ అవుతున్న పాత పత్రికా కథనం! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం! AndhraPradesh: ఏపీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా... ఎందుకంటే! Ayush Centers: ఏపీలో ఆ ప్రాంతాల ప్రజలకు శుభవార్త! రూ.44 కోట్లతో 150 కేంద్రాలు... రెండు నెలల్లో అందుబాటులోకి... YCP: పార్లమెంటులో ఇంట్రెస్టింగ్ సీన్! చేదు జ్ఞాపకాలు వద్దు.. 11వ రూమ్ తాళం వద్దన్న వైసీపీ నేతలు! Jal Jeevan Mission 2.0: 2028 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి.. జేజేఎం 2.0పై కేంద్ర, ఏపీ సర్కార్ ఒప్పందం! PMAY Scheme: ఏపీలో పేదల ఇళ్లకు లైన్ క్లియర్.... పీఎంఏవై లబ్ధిదారుల తుది జాబితా! FCRA Renewal: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు... ఆర్‌డీటీకి గ్రీన్ సిగ్నల్! నిధుల కొరతకు ఇక చెక్! LPG Vessels: హర్మూజ్ జలసంధి వద్ద టెన్షన్... గల్ఫ్‌లో నిలిచిపోయిన ఆరు భారీ ఎల్‌పీజీ నౌకలు!

YS Sharmila Property Dispute: జగన్‌కు అంత ధైర్యం లేదా? ఆస్తుల వివాదంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు!

Vijayamma Letter: వివేకా హత్య కేసు ఆస్తుల వివాదంపై వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన తల్లి విజయమ్మ రాసిన లేఖపై వైసీపీ నేతల విమర్శలను తిప్పికొడుతూ, జగన్ తన సోషల్ మీడియా సైన్యం వెనుక దాక్కుంటున్నారని ఆరోపించారు.

Published : 2026-03-23 17:10:00

విజయమ్మ లేఖపై వైసీపీ నేతల ‘మొరుగుడు’ ఏంటి?

సాక్షి పత్రికపై షర్మిల నిప్పులు

వాస్తవాలు దాచలేరు.. ప్రజలే తేలుస్తారు!

YS Vijayamma Letter: వివేకా హత్య కేసు గురించి తాను ప్రశ్నిస్తుంటే, వైసీపీ నేతలు అనవసరంగా ఆస్తుల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని షర్మిల మండిపడ్డారు. తనకు ఆస్తుల మీద ఆశ ఉంటే ఎప్పుడో కోర్టు మెట్లు ఎక్కేదానినని, కానీ తన పోరాటం కేవలం న్యాయం కోసమేనని ఆమె స్పష్టం చేశారు. ఇంకొకరి ఆస్తిని అనుభవిస్తోంది తాను కాదని, అది జగన్ అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అజెండా ఎప్పుడూ ఆస్తులు కావని, విలువలతో కూడిన రాజకీయం చేయడమే తన లక్ష్యమని షర్మిల పునరుద్ఘాటించారు.

ఆస్తుల విషయంలో తన తల్లి విజయమ్మ ఇప్పటికే పూర్తి స్పష్టత ఇచ్చారని షర్మిల గుర్తు చేశారు. విజయమ్మ స్వయంగా లేఖ రాసి వాస్తవాలను ప్రపంచానికి చాటిచెప్పారని, అయినప్పటికీ వైసీపీ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. "స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా వైసీపీ నాయకులు మొరుగుతున్నారు" అంటూ ఆమె తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తన తల్లి రాసిన లేఖ అబద్ధమని చెప్పడం ద్వారా వారు ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారని ఆమె ప్రశ్నించారు.

విజయమ్మపై ఒత్తిడి తెచ్చి తాను సంతకం చేయించానని వస్తున్న ఆరోపణలను షర్మిల కొట్టిపారేశారు. "నేను ఒత్తిడి చేస్తే.. ఆ సంతకం నాది కాదని మా అమ్మ చెప్పలేరా?" అని ఆమె లాజిక్‌తో ప్రశ్నించారు. ఆ లేఖలోని ప్రతి అక్షరం నిజమని జగన్‌కు తెలుసని, అందుకే ఆయన నేరుగా మాట్లాడకుండా తన 'సోషల్ మీడియా సైన్యం' వెనుక దాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. నిజంగా జగన్‌కు ధైర్యం ఉంటే నేరుగా వచ్చి సమాధానం చెప్పాలని ఆమె సవాలు విసిరారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టుకుని, 'సత్యమేవ జయతే' అని బ్యానర్ వేసుకునే 'సాక్షి' పత్రికలో విజయమ్మ రాసిన లేఖకు కనీసం చివరి పేజీలో కూడా చోటు దక్కకపోవడంపై షర్మిల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిజం పట్ల వారికి ఉన్న గౌరవం ఏంటో దీనిబట్టే అర్థమవుతోందని ఆమె విమర్శించారు. సాక్షి పత్రిక కేవలం ఒక వర్గానికి కొమ్ముకాస్తోందని, నిజాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆమె ఆరోపించారు.

 వైఎస్ కుటుంబంలో జరుగుతున్న ఈ పరిణామాలపై ప్రజలందరూ గమనిస్తున్నారని షర్మిల పేర్కొన్నారు. అబద్ధపు ప్రచారాలతో ఎంతో కాలం నెట్టుకురాలేరని, నిజం ఎప్పటికైనా బయటపడుతుందని ఆమె హెచ్చరించారు. తన తల్లి గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడే వారికి తగిన బుద్ధి చెబుతామని, రాజకీయం కోసం కుటుంబాన్ని వాడుకోవడం తగదని హితవు పలికారు. ప్రస్తుతం షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Spotlight

Read More →