ఓటీటీలోకి వచ్చేస్తున్న 'నారీ నారీ నడుమ మురారి'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? నవ్వుల విందుకు సిద్ధమవ్వండి! Interesting Facts: మూసి ఉన్న గదిలో దుమ్ము ఎలా చేరుతుంది? మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! 2026 phones: మెగాపిక్సెల్స్ కాదు, బ్యాటరీ కూడా కాదు… 2026 ఫోన్ కొనేటప్పుడు ఇవే అసలు సీక్రెట్స్! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! GurukulAdmissions: ఏపీ గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లు ప్రారంభం! ఉచిత కార్పొరేట్ విద్యకు ఛాన్స్…! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఓటీటీలోకి వచ్చేస్తున్న 'నారీ నారీ నడుమ మురారి'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? నవ్వుల విందుకు సిద్ధమవ్వండి! Interesting Facts: మూసి ఉన్న గదిలో దుమ్ము ఎలా చేరుతుంది? మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! 2026 phones: మెగాపిక్సెల్స్ కాదు, బ్యాటరీ కూడా కాదు… 2026 ఫోన్ కొనేటప్పుడు ఇవే అసలు సీక్రెట్స్! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! GurukulAdmissions: ఏపీ గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లు ప్రారంభం! ఉచిత కార్పొరేట్ విద్యకు ఛాన్స్…! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!!

Amaravati Capital Bill: జగన్ మూడు రాజధానుల ఆశలపై నీళ్లు.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం మాస్టర్ ప్లాన్.!!

అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొనున్నట్లు సమాచారం విభజన చట్టం సవరణ ద్వారా అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించేందుకు సిద్ధమైన మోదీ సర్కార్.

Published : 2026-01-31 08:51:00

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా  అమరావతిని  ఏకైక శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనుంది. ఇందుకు సంబంధించిన ప్రత్యేక బిల్లుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే పచ్చజెండా ఊపింది. రానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే ఈ చారిత్రక బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర కేబినెట్ సిద్ధమవుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

చట్టబద్ధత ఎందుకు? కూటమి వ్యూహం ఫలించినట్లేనా?

2014 విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగింది. గత ఏడాది జూన్ 2తో ఆ గడువు ముగియడంతో ఏపీకి ఒక స్పష్టమైన రాజధాని ప్రకటన అనివార్యమైంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో అమరావతిని పక్కనపెట్టి మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకురావడంతో రాజధాని అంశం న్యాయపరమైన చిక్కుల్లో పడింది. అయితే, 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం, భవిష్యత్తులో అధికార మార్పిడి జరిగినప్పటికీ రాజధానిని మార్చే అవకాశం లేకుండా ఉండాలంటే పార్లమెంటు చట్టబద్ధత ఒక్కటే మార్గమని భావించింది. ఈ మేరకు ప్రధాని మోదీ, అమిత్ షాల వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిపిన రాయబారం గట్టి ఫలితాన్నే ఇచ్చింది.

ప్రక్రియ వేగవంతం.. హోం శాఖ క్లియరెన్స్

అమరావతికి చట్టబద్ధత కల్పించే ఫైలుపై కేంద్ర హోం శాఖ ఇప్పటికే సంతకం చేసింది. ప్రస్తుతం ఈ బిల్లు న్యాయశాఖ, పట్టణాభివృద్ధి శాఖ సహా మరో రెండు కీలక శాఖల పరిశీలనలో ఉంది. ఆయా శాఖల అభిప్రాయాలు సేకరించిన అనంతరం దీనిని కేంద్ర మంత్రిమండలి ఆమోదానికి పంపనున్నారు. విభజన చట్టం ప్రకారం రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్రానిదే అయినప్పటికీ, దానిని కేంద్ర గెజిట్‌లో చేర్చి, పార్లమెంటు ద్వారా చట్టబద్ధత కల్పించడం ద్వారా దీనికి రాజ్యాంగపరమైన రక్షణ లభించనుంది. 2024 జూన్ 2 నుంచే అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ ఈ బిల్లులో నిబంధనలు చేర్చనున్నట్లు సమాచారం.

వైసీపీ డైలమా.. పార్లమెంటులో స్టాండ్ ఏంటి?

అమరావతి బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చినప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరించబోయే వ్యూహం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత ఐదేళ్లుగా మూడు రాజధానుల నినాదంతో ముందుకు సాగిన వైసీపీ, ఇప్పుడు పార్లమెంటులో అమరావతి బిల్లును వ్యతిరేకిస్తే అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతుందనే ఆందోళనలో ఉంది. అటు కేంద్రంలో ఎన్డీయేకు పూర్తి మెజారిటీ ఉండటంతో బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే అయినప్పటికీ, ఈ చర్చా సమయంలో వైసీపీ ఎంపీలు ఎలాంటి వాదనలు వినిపిస్తారనేది వేచి చూడాలి.

ముగియనున్న దశాబ్ద కాలపు నిరీక్షణ

అమరావతి రైతులు పదేళ్లుగా చేస్తున్న పోరాటానికి ఈ బిల్లుతో ఒక తార్కిక ముగింపు లభించనుంది. రాజధానిపై న్యాయపరమైన వివాదాలు పూర్తిగా సమసిపోతే, ప్రపంచ బ్యాంకు మరియు ఇతర అంతర్జాతీయ సంస్థల నుండి రావాల్సిన నిధుల ప్రవాహం మరింత సులభతరం అవుతుంది. మౌలిక సదుపాయాల కల్పన వేగవంతమై, పెట్టుబడులకు అమరావతి కేరాఫ్ అడ్రస్‌గా మారే అవకాశం ఉంది. మొత్తానికి, మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.

Spotlight

Read More →