దీపావళి 2026 కి విడుదలకు సిద్ధమవుతున్న రామాయణ చిత్రం..
డిజిటల్ హక్కుల కోసం రూ.1000 కోట్ల డీల్ లక్ష్యం..
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా ఉన్న ‘రామాయణం’ సినిమా గురించి ఆసక్తికరమైన వార్తలు వెలుగులోకి వచ్చాయి. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ చిత్రం దీపావళి 2026 కి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మహా ప్రాజెక్ట్ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. రెండో భాగం 2027 దీపావళి కి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్లో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా కనిపించడంతో దేశవ్యాప్తంగా భారీ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సినిమా ఓటీటీ హక్కులపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
సమాచారం ప్రకారం, ఈ చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రాకు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ రూ.700 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చిందట. అయితే ఈ ఆఫర్ను ఆయన తిరస్కరించినట్టు తెలుస్తోంది. సినిమా స్థాయి, ఖర్చు దృష్ట్యా ఇంకా ఎక్కువ మొత్తాన్ని ఆశిస్తున్నారని సమాచారం.
సమీప వర్గాల సమాచారం ప్రకారం, ఈ రెండు భాగాల డిజిటల్ హక్కుల కోసం రూ.1000 కోట్ల డీల్ లక్ష్యంగా పెట్టుకున్నారని తెలుస్తోంది. మిగిలిన రూ.3000 కోట్లను థియేట్రికల్, అంతర్జాతీయ మార్కెట్ల ద్వారా రాబట్టాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెప్పబడుతోంది.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందే అవకాశముందని నిర్మాత విశ్వసిస్తున్నారు. అవసరమైతే మొదటి భాగం హక్కులను మాత్రమే ముందుగా అమ్మి, రెండో భాగాన్ని తరువాత విడుదల తర్వాత విక్రయించే వ్యూహాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం.
‘రామాయణం’ చిత్రంలో సీత పాత్రలో సాయి పల్లవి, రావణుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవీ దూబే నటిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్కు ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్తో పాటు భారతీయ సంగీత దిగ్గజం ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.
ఇలా భారీ స్థాయిలో రూపొందుతున్న ‘రామాయణం’ చిత్రంపై రోజురోజుకీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. భారీ బడ్జెట్, అంతర్జాతీయ స్థాయి సాంకేతికత, ప్రముఖ నటీనటులతో ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో మరో మైలురాయిగా నిలిచే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.