త్వరపడండి.. హోమ్ ఆఫీస్, స్టార్టప్‌లకు ది బెస్ట్! ఇకపై వై-ఫై రూటర్ కొనే పనిలేదు - అతి తక్కువ ధరలో.!

సావరిన్ గోల్డ్ బాండ్లలో (SGB) పెట్టుబడి పెట్టిన వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మధురమైన శుభవార్త అందించింది. 2020-21 సిరీస్-I బాండ్లకు సంబంధించిన ముందస్తు విమోచన (ప్రీమెచ్యూర్ రిడెంప్షన్) ధరను ప్రకటించింది. ఒక్కో యూనిట్‌ (ఒక గ్రాము బంగారం) ధరను రూ.12,198గా నిర్ణయించినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఈ బాండ్లను రీడీమ్ చేసుకునేందుకు (నగదుగా మార్చుకోవడానికి) అక్టోబర్ 28 (మంగళవారం) నుంచి ఇన్వెస్టర్లకు అవకాశం కల్పించినట్లు స్పష్టం చేసింది.

Cyclone Montha hits: కాకినాడ మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకిన మొంథా తుఫాన్.. అధికారులు అలెర్ట్‌!

ఈ సిరీస్‌ బాండ్లను మొదట జారీ చేసినప్పుడు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వారికి ఒక్కో గ్రాముకు రూ.4,589కే లభించాయి. ఆఫ్‌లైన్‌లో కొన్నవారు రూ.4,639 చెల్లించారు. కేవలం ఐదేళ్లలోనే బంగారం విలువ గణనీయంగా పెరగడంతో, పెట్టుబడి దాదాపు మూడు రెట్లు పెరిగినట్టైంది. ఆన్‌లైన్ ఇన్వెస్టర్లకు సుమారు 166 శాతం లాభం లభించగా, ఆ కాలంలో సంవత్సరానికి 2.5 శాతం వడ్డీ కూడా పొందారు. మొత్తంగా చూస్తే ఈ SGB పథకం పెట్టుబడిదారులకు మంచి రాబడిని అందించినట్లయింది.

ఎండిన నిమ్మకాయల మ్యాజిక్.. వంటింట్లోని 6 సమస్యలకు ఇలా చెక్ పెట్టండి.. పారేస్తే నష్టమే!

ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్‌ (IBJA) ప్రకటించిన 999 స్వచ్ఛత కలిగిన బంగారం ధరల ఆధారంగా ఆర్బీఐ ఈ విమోచన ధరను లెక్కించింది. అక్టోబర్‌ 23, 24, 27 తేదీల్లో బంగారం ముగింపు ధరల సగటును తీసుకుని యూనిట్‌కు రూ.12,198గా నిర్ణయించారు. నిబంధనల ప్రకారం, బాండ్‌ జారీ చేసిన ఐదో సంవత్సరం తర్వాత వడ్డీ చెల్లింపు తేదీల్లోనే ముందస్తుగా విమోచన చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది బంగారం ధరల పెరుగుదలతో పాటు పెట్టుబడిపై వడ్డీ రాబడిని పొందాలనుకునే వారికి చక్కటి ఆర్థిక అవకాశం.

Cyclone : తుపాన్ ప్రభావం తగ్గే వరకు రైళ్లు నిలిపివేత.. భద్రత కోసం ముందస్తు చర్యలు.. భువనేశ్వర్, విశాఖ, గుంటూరు రైళ్లు రద్దు!

ప్రజల పొదుపును ఆర్థిక ఆస్తుల వైపు మళ్లించి, బంగారం దిగుమతులను తగ్గించాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం 2015లో సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని ప్రారంభించింది. కేంద్రం తరఫున ఆర్బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. ఈ బాండ్ల కాలపరిమితి 8 సంవత్సరాలు కాగా, 5 సంవత్సరాల తర్వాత ముందస్తుగా రీడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వీటిని స్టాక్ ఎక్స్చేంజీలలో ట్రేడింగ్ చేయవచ్చు, ఇతరులకు బదిలీ చేయవచ్చు. అలాగే బ్యాంకు రుణాల కోసం హామీగా కూడా ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల బంగారం కొనుగోలు చేయకుండానే బంగారం విలువ ఆధారిత పెట్టుబడి అవకాశాన్ని ప్రజలు పొందగలుగుతున్నారు.

Pollution: లాహోర్‌ గ్యాస్‌ ఛాంబర్‌గా మారింది..! ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా రికార్డు..!
Indian Railway : భారతదేశంలో మొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్! విమాన సౌకర్యాలతో రైలు ప్రయాణం అనుభవం! ఇన్ని సౌకర్యాల?
BSNL యూజర్లకు గుడ్ న్యూస్! రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు మరింత చౌకగా... అపరిమిత కాల్స్‌తో అదిరిపోయే ఆఫర్!
Coffee Powder: బంగారం కంటే వేగంగా పెరుగుతున్న కాఫీ ధర! కారణం ఇదేనేమో!
Movie update: మాస్ మహారాజా – యంగ్ హీరో కాంబినేషన్ ఫిక్స్‌! టాలీవుడ్‌లో కొత్త మల్టీస్టారర్‌పై భారీ హైప్!
Bhagavad Gita: శ్రీకృష్ణుని నోటివెంట జాలువారిన గీతామృతం.. మానవునికి మోక్ష మార్గం చూపే జ్ఞానరసాయనం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -46!