హిందూ మహాసముద్రంలోని సోమాలియా తీరంలో లైబీరియా జెండాతో ఉన్న నౌక హైజాక్ అయింది. ఇందులో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్టు తెలిసింది.
నౌక హైజాక్ సమాచారాన్ని గురువారం సాయంత్రం యూకే మారిటైమ్ ఏజెన్సీకి నౌక సందేశం పంపింది. గుర్తుతెలియని సాయుధులు నౌకలోకి ప్రవేశించి హైజాక్ చేసినట్టు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న భారత నేవీ ఐఎన్ఎస్ చెన్నైని మోహరించడంతోపాటు ఎయిర్క్రాఫ్ట్ను కూడా రంగంలోకి దింపింది. నౌకలోని సిబ్బందితో కమ్యూనికేషన్ ఏర్పడిందని, వారంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో వరసపెట్టి నౌకలపై దాడులు చేస్తున్న వేళ... హిందూ మహాసముద్రంలోనూ దుండగులు తెగబడుతున్నారు.
ఇటీవల భారత్ వస్తున్న ఓ వాణిజ్య నౌకపై గుజరాత్ తీరంలో డ్రోన్ దాడి జరిగింది. ఆ ఘటనలో 20 మంది భారతీయులు సహా సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి