టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీకి అవార్డులు కొత్త కాదు.
కింగ్ కోహ్లీ బ్యాట్ నుంచి పరుగులు జాలువారడం ఎంత సాధారణమో, అవార్డులు వెతుక్కుంటూ రావడం కూడా అంతే సాధారణం.
తాజాగా, కోహ్లీ ఖాతాలో మరో ఐసీసీ అవార్డు చేరింది. 2023 ఏడాదికి గాను కోహ్లీ ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచాడు.
ఈ పురస్కారం కోహ్లీని వరించడం ఇది నాలుగోసారి కావడం విశేషం.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
గతంలో కోహ్లీ 2012, 2017, 2018లో ఐసీసీ మేటి వన్డే ఆటగాడిగా నిలిచాడు.
తాజా అవార్డుతో కలిపి కోహ్లీ ఖాతాలోని ఐసీసీ అవార్డుల సంఖ్య 10కి పెరిగింది.
ఐసీసీ నుంచి ఇన్ని అవార్డులు అందుకున్న ఆటగాడు కోహ్లీనే. ఈ విషయంలో కోహ్లీకి దరిదాపుల్లో ఎవరూ లేరు.
కోహ్లీ తర్వాత శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం కుమార్ సంగక్కర, టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ చెరో 4 అవార్డులతో రెండో స్థానంలో ఉన్నారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి