అరుణాచల్ ప్రదేశ్తో హైదరాబాద్లో ప్రారంభమైన రంజీట్రోఫీ ప్లేట్ డివిజన్ మ్యాచ్లో హైదరాబాదీ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
కేవలం 147 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇందులో 33 ఫోర్లు, 21 సిక్సర్లు ఉన్నాయి.
తన్మయ్ వీర బాదుడుతో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 48 ఓవర్లలో వికెట్ నష్టానికి 529 పరుగుల భారీ స్కోరు సాధించింది.
హైదరాబాద్ కెప్టెన్ రాహుల్ సింగ్ 105 బంతుల్లో 185 పరుగులు చేశాడు. మొత్తంగా 160 బంతులు ఎదుర్కొన్న తన్మయ్ అగర్వాల్ 323 పరుగులు సాధించి క్రీజులో ఉన్నాడు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రికార్డుగా నమోదైంది.
2017-18లో దక్షిణాఫ్రికాకు చెందిన మార్కో మరియస్ 191 బంతుల్లో త్రిశతకం సాధించాడు.
న్యూజిలాండ్కు చెందిన కెన్ రూథర్ఫర్డ్ 234, విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ 244, శ్రీలంక క్రికెటర్ కుశాల్ పెరీరా 244 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించారు. తన్మయ్ ఇప్పుడా రికార్డులన్నింటినీ బద్దలుగొట్టాడు.
అంతేకాదు, ఇదే మ్యాచ్లో భారత క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించిన (119 బంతుల్లో) ఆటగాడిగానూ తన్మయ్ రికార్డులకెక్కాడు.
39 సంవత్సరాల క్రితం రవిశాస్త్రి (123 బంతుల్లో) నమోదు చేసిన రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయింది.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి