Money Plant: మనీ ప్లాంట్ పెంచుతున్నారా... ఏ దిశలో పెడితే మంచిదో తెలుసా! Chandrababu: మోదీ, అమిత్ షాలకు చంద్రబాబు అభినందనలు.. బెంగాల్, అస్సాం ఫలితాలపై హర్షం.. Tamil Politics: దూసుకుపోతున్న టీవీకే.. విజయ్ ఇంటి వద్ద భద్రత పెంపు.. దళపతి నివాసం వద్ద భారీ పోలీస్ బందోబస్తు.! Mini Mahanadu 2026: సౌదీ గడ్డపై టీడీపీ మినీ మహానాడు... రిజిస్ట్రేషన్లు ప్రారంభం! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తులపై కీలక అప్డేట్! TVK party: 50 ఏళ్ల రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తున్న టీవీకే.! విజయ్ ప్రభంజనం.. కింగ్‌మేకర్‌గా దళపతి? Farmers: రైతులకు శుభవార్త... భారీ సబ్సిడీతో వ్యవసాయ యంత్రాల పంపిణీ! పూర్తి వివరాలు... PM Modi: ఐదు రాష్ట్రాల కౌంటింగ్ వేళ.. మోదీ ట్వీట్‌పై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ! Pawan Kalyan: సింధు ప్రశంసలు.. పవన్ రిప్లై: ‘మ్యాజిక్’ డ్రెయిన్స్‌పై ఆసక్తికర చర్చ! Road Accident: తిరుపతి హైవేపై ఘోర ప్రమాదం! లారీని ఢీకొన్న అంబులెన్స్.. నలుగురు బలి!! Money Plant: మనీ ప్లాంట్ పెంచుతున్నారా... ఏ దిశలో పెడితే మంచిదో తెలుసా! Chandrababu: మోదీ, అమిత్ షాలకు చంద్రబాబు అభినందనలు.. బెంగాల్, అస్సాం ఫలితాలపై హర్షం.. Tamil Politics: దూసుకుపోతున్న టీవీకే.. విజయ్ ఇంటి వద్ద భద్రత పెంపు.. దళపతి నివాసం వద్ద భారీ పోలీస్ బందోబస్తు.! Mini Mahanadu 2026: సౌదీ గడ్డపై టీడీపీ మినీ మహానాడు... రిజిస్ట్రేషన్లు ప్రారంభం! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తులపై కీలక అప్డేట్! TVK party: 50 ఏళ్ల రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తున్న టీవీకే.! విజయ్ ప్రభంజనం.. కింగ్‌మేకర్‌గా దళపతి? Farmers: రైతులకు శుభవార్త... భారీ సబ్సిడీతో వ్యవసాయ యంత్రాల పంపిణీ! పూర్తి వివరాలు... PM Modi: ఐదు రాష్ట్రాల కౌంటింగ్ వేళ.. మోదీ ట్వీట్‌పై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ! Pawan Kalyan: సింధు ప్రశంసలు.. పవన్ రిప్లై: ‘మ్యాజిక్’ డ్రెయిన్స్‌పై ఆసక్తికర చర్చ! Road Accident: తిరుపతి హైవేపై ఘోర ప్రమాదం! లారీని ఢీకొన్న అంబులెన్స్.. నలుగురు బలి!!

Om Birla: పార్లమెంట్ కమిటీల పునర్ వ్యవస్థీకరణ.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం!

Om Birla: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా 2026–27 సంవత్సరానికి సంబంధించిన నాలుగు కీలక పార్లమెంట్ కమిటీలను పునర్వ్యవస్థీకరించారు. ఈ కమిటీలు ప్రభుత్వ పనితీరును సమీక్షించడం, పారదర్శకతను పెంచడం వంటి ముఖ్య బాధ్యతలను నిర్వహిస్తాయి.

Published : 2026-05-02 15:05:00

నాలుగు కీలక పార్లమెంట్ కమిటీలను పునర్ వ్యవస్థీకరణ..

ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో కీలక పాత్ర..

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా 2026–27 సంవత్సరానికి సంబంధించిన నాలుగు కీలక పార్లమెంట్ కమిటీలను పునర్వ్యవస్థీకరించారు. ఈ కమిటీలు ప్రభుత్వ పనితీరును సమీక్షించడం, పారదర్శకతను పెంచడం వంటి ముఖ్య బాధ్యతలను నిర్వహిస్తాయి.

లోక్‌సభకు చెందిన 30 మంది సభ్యులతో కూడిన అంచనాల కమిటీ (కమిటీ ఆఫ్ ఎష్టిమేట్స్)కి బీజేపీ ఎంపీ డా. సంజయ్ జైస్వాల్ ను ఛైర్మన్‌గా నియమించారు.

లోక్‌సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి 7 మంది సభ్యులతో కూడిన పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీకి బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా అధ్యక్షత వహించనున్నారు.

పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి కాంగ్రెస్ ఎంపీ కే.సీ. వేణుగోపాల్ ను ఛైర్మన్‌గా నియమించారు. ఈ కమిటీలో లోక్‌సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి 7 మంది సభ్యులు ఉంటారు.

అనుసూచిత జాతులు, అనుసూచిత తెగల సంక్షేమ కమిటీకి బీజేపీ ఎంపీ ఫగ్గన్ సింగ్ కులస్తే ను ఛైర్మన్‌గా నియమించారు. ఈ కమిటీలో లోక్‌సభ నుంచి 20 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు.

ఈ కమిటీల పదవీకాలం ఈ నెల 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు కొనసాగుతుంది. పార్లమెంటరీ వ్యవస్థలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రభుత్వ ఖర్చులు, ప్రజా రంగ సంస్థల పనితీరు, సామాజిక సంక్షేమ కార్యక్రమాల అమలును సమీక్షిస్తూ ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో ఇవి ప్రధాన బాధ్యత వహిస్తాయి.

Spotlight

Read More →