Israeli Airstrikes: లెబనాన్‌లో ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. 10 మంది మృతి, 50 మందికి గాయాలు! Elevated Flyover: ట్రాఫిక్ కష్టాలకు చెక్... 14 కి.మీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! డీపీఆర్ సిద్ధం.... Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'! AP Politics: తిరుమల తరహాలోనే శ్రీశైలం లడ్డూలోనూ కల్తీ నెయ్యి..! దేవాలయాల పవిత్రత కాపాడటమే మా లక్ష్యం..! New Expressway: చెన్నై-బెంగళూరు మధ్య తగ్గుతున్న దూరం... రూ.8,925 కోట్లతో రెండు కొత్త హైవేలు! ఆ రూట్లోనే... YSRCP: వైసీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం! నాలుగు రాష్ట్రాల్లో మోసాలు... వైసీపీ నేత అరెస్ట్! పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ లేడీ డాన్... తిరుమల ఏఐ టెక్నాలజీపై కేంద్రమంత్రి ప్రశంసలు! Tirumala: తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం... కూటమి నేతల ఆగ్రహం! Meerut Metro: మేక్ ఇన్ ఇండియా అద్భుతం! అత్యంత వేగవంతమైన మెట్రో సేవలు అందుబాటులోకి...! High Court: రాయలసీమ అభివృద్ధిలో మరో మైలురాయి...! కర్నూలు హైకోర్టు బెంచ్‌పై మంత్రి భరోసా...! Israeli Airstrikes: లెబనాన్‌లో ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. 10 మంది మృతి, 50 మందికి గాయాలు! Elevated Flyover: ట్రాఫిక్ కష్టాలకు చెక్... 14 కి.మీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! డీపీఆర్ సిద్ధం.... Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'! AP Politics: తిరుమల తరహాలోనే శ్రీశైలం లడ్డూలోనూ కల్తీ నెయ్యి..! దేవాలయాల పవిత్రత కాపాడటమే మా లక్ష్యం..! New Expressway: చెన్నై-బెంగళూరు మధ్య తగ్గుతున్న దూరం... రూ.8,925 కోట్లతో రెండు కొత్త హైవేలు! ఆ రూట్లోనే... YSRCP: వైసీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం! నాలుగు రాష్ట్రాల్లో మోసాలు... వైసీపీ నేత అరెస్ట్! పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ లేడీ డాన్... తిరుమల ఏఐ టెక్నాలజీపై కేంద్రమంత్రి ప్రశంసలు! Tirumala: తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం... కూటమి నేతల ఆగ్రహం! Meerut Metro: మేక్ ఇన్ ఇండియా అద్భుతం! అత్యంత వేగవంతమైన మెట్రో సేవలు అందుబాటులోకి...! High Court: రాయలసీమ అభివృద్ధిలో మరో మైలురాయి...! కర్నూలు హైకోర్టు బెంచ్‌పై మంత్రి భరోసా...!

నేను, బ్రహ్మణి అమెరికాలో అన్నీ పంచుకున్నాం.. మంత్రి లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఇంట్లో లోకేశ్ ఏం చేస్తారంటే?

"నేను, నా భార్య బ్రహ్మణి అమెరికాలో ఉన్నప్పుడు ఇంటి పనులను సమానంగా పంచుకునేవాళ్లం. అటువంటి మార్పు ఈ సమాజంలో ప్రతి ఇంట్లోనూ రావాలని నేను బలంగా కోరుకుంటున్నాను" అన

Published : 2025-11-24 19:09:00

"నేను, నా భార్య బ్రహ్మణి అమెరికాలో ఉన్నప్పుడు ఇంటి పనులను సమానంగా పంచుకునేవాళ్లం. అటువంటి మార్పు ఈ సమాజంలో ప్రతి ఇంట్లోనూ రావాలని నేను బలంగా కోరుకుంటున్నాను" అని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. 

సమాజంలో స్త్రీ, పురుష సమానత్వంపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం నిర్వహించిన 'నైతిక విలువల'పై రాష్ట్రస్థాయి విద్యా సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, మహిళల పట్ల గౌరవం ఇంటి నుంచే ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. "చిన్నప్పుడు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరినీ గౌరవించాలని మా అమ్మ భువనమ్మ నాకు నేర్పించారు. కానీ మన సమాజంలో 'గాజులు తొడుక్కున్నావా?', 'చీర కట్టుకున్నావా?' అంటూ మహిళలను కించపరిచే ధోరణి ఇంకా కొనసాగుతోంది. 

దీనికి పూర్తిగా ఫుల్‌స్టాప్ పెట్టాలి" అని పిలుపునిచ్చారు. సినిమాలు, వెబ్ సిరీస్‌లలో కూడా మహిళలను అగౌరవపరిచే సంభాషణలు, సన్నివేశాలు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిలతో చర్చించినట్లు ఆయన తెలిపారు.

విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పాఠ్యపుస్తకాలను పరిశీలించగా, ఇంటి పనులు చేస్తున్న ఫోటోలన్నీ మహిళలవే కనిపించాయని లోకేశ్ గుర్తుచేశారు. "ఆ చిత్రాలను వెంటనే మార్పించాం. ఇంటి పనుల్లో పురుషులు కూడా పాలుపంచుకుంటున్నట్టుగా 50-50 నిష్పత్తిలో కొత్త ఫోటోలను చేర్చాం. ఈ మార్పు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, ప్రతి ఒక్కరి ఆలోచనల్లోనూ రావాలి" అని ఆయన ఆకాంక్షించారు.

తన రాజకీయ ప్రస్థానాన్ని వివరిస్తూ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. "2019 ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయినప్పుడు ఒక్కరోజే బాధపడ్డాను. కానీ ఆ ఓటమి నాలో కసిని పెంచింది. ఐదేళ్ల పాటు ప్రజల మధ్య ఉండి, వారి మనసు గెలుచుకోవాలని కష్టపడ్డాను. 

ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా వెనకడుగు వేయలేదు. దాని ఫలితమే 2024 ఎన్నికల్లో 91 వేల ఓట్ల భారీ మెజారిటీ. జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడాలి. మార్కులు తగ్గినా, తల్లిదండ్రులు మందలించినా ఆత్మహత్యల వంటి పిరికి చర్యలకు పాల్పడవద్దు" అని విద్యార్థులకు హితవు పలికారు.

Spotlight

Read More →