Gudivada: మాజీ మంత్రి కఠారి ఇంట్లో భారీ చోరీ! సీన్ చూసి పోలీసులు షాక్...! National Highway: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే! రూ.1,670 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఘాట్ రోడ్డుకు కొత్త కళ! Corporation Scam: గుంటూరు కార్పొరేషన్‌లో టెండర్ల కుంభకోణం..! మాయమైన 200 కీలక ఫైళ్లు..! AP Politics: ముగిసిన ప్రజాప్రతినిధుల పదవీ కాలం...! నేటి నుంచి ప్రత్యేకాధికారుల చేతుల్లోకి అధికారం! Petrol Diesel Price: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం బిగ్ అప్డేట్! Praja Vedika: నేడు (18/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఇక నుండి అది తప్పనిసరి... ఆదేశాలు జారీ! AP Secretariat: స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అలర్ట్… కొత్త నిబంధనలు! AP Government: ఉత్తరాంధ్ర గేమ్ ఛేంజర్! రూ. 4,361 కోట్లతో అక్కడ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! Prathipadu: ప్రత్తిపాడులో పులి కలకలం! ఆ సరిహద్దు గ్రామాల్లో హై అలర్ట్! Gudivada: మాజీ మంత్రి కఠారి ఇంట్లో భారీ చోరీ! సీన్ చూసి పోలీసులు షాక్...! National Highway: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే! రూ.1,670 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఘాట్ రోడ్డుకు కొత్త కళ! Corporation Scam: గుంటూరు కార్పొరేషన్‌లో టెండర్ల కుంభకోణం..! మాయమైన 200 కీలక ఫైళ్లు..! AP Politics: ముగిసిన ప్రజాప్రతినిధుల పదవీ కాలం...! నేటి నుంచి ప్రత్యేకాధికారుల చేతుల్లోకి అధికారం! Petrol Diesel Price: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం బిగ్ అప్డేట్! Praja Vedika: నేడు (18/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఇక నుండి అది తప్పనిసరి... ఆదేశాలు జారీ! AP Secretariat: స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అలర్ట్… కొత్త నిబంధనలు! AP Government: ఉత్తరాంధ్ర గేమ్ ఛేంజర్! రూ. 4,361 కోట్లతో అక్కడ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! Prathipadu: ప్రత్తిపాడులో పులి కలకలం! ఆ సరిహద్దు గ్రామాల్లో హై అలర్ట్!

భారత్-ఈయూ చారిత్రక వాణిజ్య ఒప్పందం ఖరారు... 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్' పై సంతకం చేసిన ప్రధాని మోదీ!!

భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దీనిని 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్' గా అభివర్ణించిన ప్రధాని మోదీ..

Published : 2026-01-27 11:41:00

భారత ఆర్థిక దౌత్య చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-యూరోపియన్ యూనియన్ (EU) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై మంగళవారం అధికారికంగా సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందాన్ని "మదర్ ఆఫ్ ఆల్ డీల్స్"  గా అభివర్ణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇది రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య ఒక ‘అద్భుతమైన భాగస్వామ్యం’ అని కొనియాడారు.

ఢిల్లీలో జరుగుతున్న 16వ భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సమావేశంలో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా పాల్గొన్నారు. రిపబ్లిక్ డే వేడుకలకు అతిథులుగా విచ్చేసిన వీరు, ఈ పర్యటనలోనే భారత వాణిజ్య రంగానికి ఊతమిచ్చే భారీ డీల్‌ను ఖరారు చేశారు.

ప్రస్తుతం అమెరికా విధిస్తున్న భారీ సుంకల నేపథ్యంలో, యూరోపియన్ యూనియన్‌తో కుదిరిన ఈ ఒప్పందం భారత ఎగుమతిదారులకు పెద్ద ఊరటనివ్వనుంది. ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశాలు మరియు లాభాలు 

మ్యానుఫ్యాక్చరింగ్ జోరు: భారతదేశంలోని తయారీ రంగం మరియు సేవా రంగానికి ఈ ఒప్పందం భారీ ఎత్తున ఊతమిస్తుందని మోదీ స్పష్టం చేశారు.

గ్లోబల్ జీడీపీ వాటా: ఈ ఒప్పందం ప్రపంచ జీడీపీలో 25 శాతం మరియు ప్రపంచ వాణిజ్యంలో మూడో వంతు వాటాను సూచిస్తుందని ప్రధాని గుర్తుచేశారు.

ఎగుమతులకు మార్గం సుగమం: టెక్స్‌టైల్స్, జ్యువెలరీ వంటి రంగాలకు యూరప్ మార్కెట్లలో భారీ అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధిస్తున్న 50 శాతం సుంకల ప్రభావం నుంచి భారతీయ వ్యాపారులకు ఇది రక్షణ కవచంలా మారుతుంది.

భారత్-ఈయూ ఒప్పందం పట్ల అమెరికా అడ్మినిస్ట్రేషన్ కొంత అసహనం వ్యక్తం చేస్తోంది. రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్న భారత్‌పై తాము ఆంక్షలు విధిస్తుంటే, యూరప్ దేశాలు వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం ఏంటని ట్రంప్ సన్నిహితుడు స్కాట్ బెసెంట్ విమర్శించారు. అయితే, భారత్ అభివృద్ధి ప్రపంచ సుస్థిరతకు అవసరమని ఉర్సులా వాన్ డెర్ లేయన్ ధీమా వ్యక్తం చేశారు. విజయవంతమైన భారత్ ప్రపంచాన్ని మరింత సురక్షితంగా మారుస్తుంది అని ఆమె పేర్కొన్నారు.

వాణిజ్య ఒప్పందంతో పాటు రక్షణ మరియు భద్రతా రంగాల్లో కూడా పరస్పర సహకారంపై ఇరు పక్షాలు చర్చలు జరిపాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఈయూ ప్రతినిధి బృందం భేటీ అయ్యి, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ ఒప్పందం యొక్క పూర్తి స్థాయి అమలు వచ్చే ఏడాది నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. చట్టపరమైన ప్రక్రియలు ముగిసిన తర్వాత, ఇది ఆసియా-యూరప్ వాణిజ్య సంబంధాల్లో మైలురాయిగా నిలవనుంది

Spotlight

Read More →