- హనుమంతరాయ చౌదరి మరణం టీడీపీకి లోటు అని వ్యాఖ్య..
- వార్డు సభ్యుడిగా ప్రజాసేవను ప్రారంభించి..
Anantapuram Chandrababu: అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీనియర్ నేత అయిన హనుమంతరాయ చౌదరి మరణం జిల్లాలో పార్టీకి లోటు అని వ్యాఖ్యానించారు. ఆయన మృతి కళ్యాణదుర్గం నియోజకవర్గ పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని అన్నారు. వార్డు సభ్యుడిగా ప్రజాసేవను ప్రారంభించి, సర్పంచ్గా, మార్క్ ఫెడ్ చైర్మన్గా, 10 ఏళ్ల పాటు అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పని చేశారని సీఎం గుర్తు చేసుకున్నారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచి కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపారని కొనియాడారు. పార్టీ బలోపేతానికి హనుమంతరాయ చౌదరి ఎనలేని సేవలు అందించారని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.