ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక సాయం అందించాలని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్తో పయ్యావుల కేశవ్ భేటీ అయ్యారు. గత ఐదేళ్లలో 93 కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలు చేయలేదని సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ పథకాలను అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.. 73 కేంద్ర పథకాలను పునరుద్ధరించినట్లు చెప్పారు. రాష్ట్ర వాటా ఇచ్చిన పథకాలకు కేంద్ర నిధులు ఇవ్వాలని కోరారు. పెండింగ్ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన ప్రాంతాలకిచ్చే ప్రత్యేక గ్రాంట్ పెండింగ్ నిధులు ఇవ్వాలన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
2025 ఏడాదికి ఏపీ సర్కార్ సెలవుల జాబితా విడుదల! 21 ఐచ్ఛిక సెలవులు..
ఏపీలో కొత్త యూనివర్సిటీ.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఎక్కడ అంటే?
ఆర్జీవీ నోటి దూల తగ్గలా.. రేవంత్ రెడ్డి పై కారు కూతలు!
కావాలని కొట్టలేదు - ఐయామ్ సారీ! జర్నలిస్ట్ సంఘాలకి క్షమాపణలు.. వెంట విష్ణు కూడా..
రఘురామకృష్ణ చిత్రహింసల కేసులో కిలక మలుపు! గుంటూరు జీజీహెచ్లో...!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: