రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాలని తిరుపతి కొండ ఎక్కినప్పుడు మొక్కుకున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(pawankalyan) అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం పనసభద్ర పంచాయతీ బాగుజోల గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషను తిలకించారు. అనంతరం నూతన రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో సుమారు రూ.36.71 కోట్ల వ్యయంతో, 39.32 కి. మీ. మేర నూతన రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు.. తద్వారా 55 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు.
ఇంకా చదవండి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు! 21 అంశాలపై...!
2017 పోరాట యాత్ర సమయంలో గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కొన్ని సమస్యలు చూశానని పవన్ తెలిపారు. తాగునీరు, రహదారులు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ కట్టారు గానీ.. ఇక్కడ రోడ్లు మాత్రం వేయలేకపోయారని వైకాపా(ysrcp) పాలనను విమర్శించారు. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పవన్ అన్నారు. కూటమి ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోయినా గిరిజన ప్రాంతాల్లో రహదారులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. సుందరమైన జలపాతాలు ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జనసేన లీగల్ సెల్ లో కీలక నియామకం! పార్టీ జనరల్ కౌన్సిల్ గా ఎవరు అంటే!
జగన్ కు ఊహించని షాక్! మాజీ మంత్రితో పాటు పలువురు వైకాపా నేతలపై కేసు నమోదు.. కారణం ఇదే!
ఆర్జీవీకి అక్రమ చెల్లింపులు... జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! ఎందుకు? ఎంత అంటే!
త్వరలో వైసీపీ ఖాళీ.. టీడీపీ టచ్లోకి వైకాపా ఎమ్మెల్యేలు! జగన్వి పగటి కలలేనా..
అమెరికాలో పనిచేయాలని కలలు కనే వారికి శుభవార్త! ఇకపై ఆ సమస్య ఉండదు! ఈ కొత్త విధానంలో..
రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఈ యాప్లో టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా రిజర్వేషన్ దొరుకుతుంది!
నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి స్పందన! జీజీహెచ్ వైద్యులతో పాటు ప్రత్యేక వైద్య బృందాలు!
ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!
టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకా? బెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..
ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: