తెదేపా కార్యకర్తలకు మంత్రి కొలుసు పార్థసారథి మరోసారి క్షమాపణలు చెప్పారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్తో కలిసి పాల్గొనడంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో పార్థసారథి ఇప్పటికే సీఎం చంద్రబాబు కు క్షమాపణలు చెప్పారు. తాజాగా మీడియా సమావేశం నిర్వహించి కార్యకర్తలకు సారీ చెప్పారు. “చంద్రబాబు, లోకేశ్ నాకిచ్చిన గౌరవాన్ని ఎప్పుడూ మర్చిపోను. తెదేపా సిద్ధాంతాలను దెబ్బతీసే వ్యక్తిని మాత్రం కాదు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మళ్లీ ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతా. తెదేపా కార్యక్రమాల్లో చొరబడటం వైకాపా నేతలకు అలవాటే. వ్యక్తిగతంగా జోగి రమేష్తో నాకెలాంటి సంబంధం లేదు” అని మంత్రి పార్థసారథి తెలిపారు. తెదేపా ప్రతిపక్షంలో ఉండగా సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటిపైకి దండెత్తి వచ్చిన జోగి రమేష్తో... సీనియర్ మంత్రి కొలుసు పార్థసారథి, రెండుసార్లు ఎంపీగా పనిచేసిన అత్యంత సీనియర్ నాయకుడు, ప్రస్తుత ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష వేదిక పంచుకోవడంపై తెదేపా శ్రేణులు మండిపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి స్పందిస్తూ సారీ చెప్పారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
2025 ఏడాదికి ఏపీ సర్కార్ సెలవుల జాబితా విడుదల! 21 ఐచ్ఛిక సెలవులు..
ఏపీలో కొత్త యూనివర్సిటీ.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఎక్కడ అంటే?
ఆర్జీవీ నోటి దూల తగ్గలా.. రేవంత్ రెడ్డి పై కారు కూతలు!
కావాలని కొట్టలేదు - ఐయామ్ సారీ! జర్నలిస్ట్ సంఘాలకి క్షమాపణలు.. వెంట విష్ణు కూడా..
రఘురామకృష్ణ చిత్రహింసల కేసులో కిలక మలుపు! గుంటూరు జీజీహెచ్లో...!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: