అధికారం అండతో గన్నుపెట్టి ఆస్తులు రాయించుకోవడం ఎక్కడా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వ్యాపారాల్లో వాటాలు తీసుకున్న ఘటనలు దేశ చరిత్రలోనే లేవన్నారు. కొత్త తరహా నేరాల పట్ల చర్యలేంటో ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోందని పేర్కొన్నారు. అవినీతి గురించి విన్నాం కానీ.. వ్యాపారాల్లో వాటాలు లాక్కోవడం ఇప్పుడే చూస్తున్నామన్నారు. తుపాకీ చూపించి మరీ ఆస్తుల్లో వాటాలు లాక్కోవడం మునుపెన్నడూ లేదన్నారు. ముంబయిలో మాఫియా బృందాలు లాక్కునే ఆస్తులను సీజ్ చేసే చట్టం ఉందని.. ఆ అంశంపై సమాచారం తెప్పించుకుంటామని చెప్పారు. ఆస్తులను పోగొట్టుకున్న వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమరావతి అభివృద్ధికి కోటి విరాళం అందించిన మహిళ! తల్లి కోరిక నెరవేర్చిన కుమార్తె!
చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ! పలు కీలక అంశాలపై!
టీడీపీలోకి వైసీపీ కీలక నేత..? చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కూడా!
ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: