రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా పరంగా ప్రగతి కనిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. విద్య, మౌలిక వసతులపై ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి జిల్లాలు, మండలాల వారీగా అకెడమిక్స్, మౌలిక సదుపాయాల ఆధారంగా ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్ ఇవ్వనున్నట్లు లోకేశ్ తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారా, ప్రైవేటు పాఠశాలల్లో ఉన్నారా అనే సమాచారం స్పష్టంగా ఉండాలన్నారు. “మధ్యాహ్న భోజనంలో పోషక విలువలు ఉండేలా చూడాలని సీఎం స్పష్టంగా ఆదేశాలిచ్చారు. ఉన్నత విద్యాశాఖలోనూ భోజనం విషయంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. హాస్టళ్లలో పరిశుభ్రతపైనా ఫిర్యాదులు వస్తున్నాయి. టాయిలెట్స్ లాంటి మౌలికమైన సదుపాయాలు కూడా సరిగ్గా ఉండటం లేదు. విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. పేరెంట్స్-టీచర్ల మీటింగ్లో 'డ్రగ్స్ వద్దు బ్రో' అనే క్యాంపెయిన్ మొదలు పెడదాం. యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ మరింత విస్తృతం చేస్తాం. కేజీ నుంచి పీజీ వరకూ పాఠ్యాంశాల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మార్పులు కనిపించాలి” అని లోకేశ్ అన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల! ఎప్పటి నుంచీ ఎప్పటి వరకుఅంటే?
మంత్రి లోకేశ్ ను మెచ్చుకున్న చంద్రబాబు! ఎందుకు అంటే! ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలు..
ఆయన మా నాన్న కాదు.. ఆ హక్కు లేదు -మంచు మనోజ్! ఏడు నెలల కూతురును కూడా!
వైన్ షాపులపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! బెల్ట్ షాపుల యజమానులపై.. ఇక కిక్కు ఎక్కాల్సిందే!
ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పరీక్ష లేకుండానే ఎంపిక! ఈ అర్హతలు ఉంటే చాలు.. Don't Miss
నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదల? ఎప్పుడు అంటే?
ఏపీలో కూటమి సర్కార్ క్రిస్మస్ కానుక.. మంత్రి కీలక ప్రకటన! రాష్ట్రంలో రూ.340 కోట్లతో..
ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!
మరో ఫుడ్ పాయిజన్ ఘటన... రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం! విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ!
ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!
చంద్రబాబు కీలక నిర్ణయం.. నాగబాబుకు కీలక పదవి - టీడీపీ రాజ్యసభ సభ్యుల ఖరారు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: