రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ తరలింపునకు సంబంధించి కాకినాడ కేంద్రంగా జరిగిన ఘటనలు, ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసుల పై సీబీసీఐడీతో విచారణ చేయిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారని, ఈ మొత్తం వ్యవహారాలపై ఇప్పటికే సీఎం ఆరా తీశారన్నారు. గురువారం ఉదయం విశాఖలో ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు, డీసీఎస్ఓలు, పౌరసరఫరాల సంస్థ మేనేజర్లు, తూనికలు, కొలతల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందన్నారు. ఇప్పటికే 1,066 కేసులు నమోదవగా, 729 మందిని అరెస్టు చేసి, 102 వావాహలను స్వాధీనం చేసుకున్నామన్నారు. రాష్ట్రం నుంచి 62,000 టన్నుల బియ్యం అక్రమంగా రవాణా జరిగిందని, వాటి విలువ సుమారు రూ.240 కోట్లు అని మంత్రి పేర్కొన్నారు.
ఇంకా చదవండి: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రకటన! నామినేటెడ్ పోస్టుల మరో జాబితా సిద్దం - దక్కేది వీరికే!
విశాఖ, కృష్ణపట్నం పోర్టుల కంటే కాకినాడ పోర్టు నుంచే ఎక్కువ మొత్తంలో బియ్యం తరలిపోయాయని, ఇందులో కొందరు అధికారుల పాత్ర కూడా ఉందన్నారు. స్టెల్లా షిప్లో అన్ని విభాగాలను కలెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్నారన్నారు. బియ్యం అక్రమంగా తరలించే వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని, ఆ మేరకు చట్టాన్ని సవరిస్తామని చెప్పారు. గత జూన్లో కాకినాడలో 28 గోదాములపై దాడులు చేయగా, 51 లక్షల టన్నుల రేషన్ బియ్యం పట్టుబడ్డాయని, అప్పటి నుంచీ ప్రత్యేక దృష్టి సారించడంతో కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న అక్రమ బియ్యం తరలింపు వ్యవహారంలో స్పష్టత వచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఆ పోర్టు స్మగ్లింగ్ డెన్గా మారిపోయిందని మంత్రి మనోహర్ ఆరోపించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ వీరపాండియన్, సంస్థ ఎండీ మంజిర్ జిలానీ, విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జేసీ మయూర్ అశోక్ పాల్గొన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు! మంత్రి లోకేశ్ సమక్షంలో గూగుల్ తో కీలక ఒప్పందం!
బీఆర్ఎస్కు ఊహించని షాక్! కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే!
నిరుద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం మంచి అవకాశం.. 8వ తేదీ నుంచి ప్రారంభం!Don'tMiss
కొడాలి నానికి వరుస షాక్ లు! తొమ్మిది మంది అరెస్ట్ - పరారీలో ప్రధాన అనుచరుడు..
మహిళలకు అప్డేట్.. ఉచిత బస్సు అమలుపై కీలక ప్రకటన! 1600 కొత్త బస్సులను కొనుగోలు!
కొడాలి నానికి వరుస షాక్ లు! తొమ్మిది మంది అరెస్ట్ - పరారీలో ప్రధాన అనుచరుడు..
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం! ఇక ఆ సమస్య లేనట్టే!
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం! ఇక ఆ సమస్య లేనట్టే!
మందుబాబులకు బిగ్ షాక్.. రాష్ట్రంలో వైన్స్ బంద్! ఎప్పటి నుంచంటే..? ఎందుకంటే?
అమరావతి అభివృద్ధికి కోటి విరాళం అందించిన మహిళ! తల్లి కోరిక నెరవేర్చిన కుమార్తె!
చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ! పలు కీలక అంశాలపై!
టీడీపీలోకి వైసీపీ కీలక నేత..? చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కూడా!
ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: