అమరావతి: మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమార్తె షర్మిల.. బుధవారం తాడేపల్లిలో తన అన్న, సీఎం జగన్మోహన్రెడ్డి నివాసానికి వెళ్లారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వానపత్రికను అందజేశారు. మంగళవారం ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద కుమారుడి మొదటి పెళ్లి పత్రికను పెట్టి ఆశీర్వాదం తీసుకున్న ఆమె.. బుధవారం కుటుంబ సభ్యులతో ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఆక్కడ ఆమెకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వాగతం పలికారు. గన్నవరం నుంచి తాడేపల్లి చేరుకున్న షర్మిల సాయంత్రం 5.38 గంటలకు జగన్ నివాసంలో అడుగుపెట్టారు. అన్నావదినలకు కుమారుడి పెళ్లి పత్రిక అందజేసి.. పెళ్లికి రావాలని ఆహ్వానించారు. కేవలం 15 నిమిషాలు మాత్రమే జగన్ నివాసంలో ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా గన్నవరం సమీపంలోని కేసరపల్లిలోని విల్లాలో బ్రదర్ అనిల్తో ఆమె సమాలోచనలు సాగించారు. అనంతరం షర్మిల.. భర్తతో కలిసి ఢిల్లీ బయల్దేరారు. గురువారం ఆమె కాంగ్రె్సలో చేరతారు
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి