తన తండ్రి కృష్ణకు పింఛను వచ్చిందని, ఎంపీటీసీ సభ్యురాలిగా పంపిణీ కార్యక్రమానికి రావాలని పిలిచి.. వైకాపా కండువా వేశారంటూ విజయనగరం జిల్లా ఆండ్ర గ్రామ తెదేపా నాయకురాలు నరసమ్మ అన్నారు. సోమవారం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం పూర్తయ్యాక వేదిక దిగిన తనకు ఉపముఖ్యమంత్రి రాజన్నదొర వైకాపా కండువా వేశారని చెప్పారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఈ మేరకు ఆమె విలేకర్లతో మాట్లాడారు. పింఛను పేరుతో మోసగించారని, తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. ఎప్పటికీ టీడీపీ లోనే ఉంటానని స్పష్టం చేశారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి