మంగళగిరి సమగ్రాభివృద్ధి నినాదంతో ఆకర్షితులవుతున్న నేతలు
లోకేష్ పిలుపుతో భారీగా తరలివస్తున్న వివిధ పార్టీల నాయకులు
యువనేత సమక్షంలో 160 కుటుంబాలకు పైగా టిడిపిలో చేరిక
మంగళగిరి: మంగళగిరి సమగ్రాభివృద్ధి కోసం ప్రతిఒక్కరూ కలసిరావాలన్న యువనేత నారా లోకేష్ పిలుపునకు నియోజకవర్గంలో భారీగా స్పందన లభిస్తోంది. లోకేష్ నినాదానికి ఆకర్షితులైన పలువురు తటస్థులు, వైసిపితోపాటు వివిధపార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు యువనేత సమక్షంలో టిడిపిలో చేరుతున్నారు. ఆదివారం సాయంత్రంలో ఉండవల్లిలోని నివాసంలో పలువురు ప్రముఖులు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
వారందరికీ లోకేష్ పసుపుకండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. బిజెపి వీవర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు, మంగళగిరి లక్ష్మీనరసింహ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు జగ్గారపు రామ్మోహన్ రావు (రాము), ఆయన కుమారుడు జగ్గారపు రామ్ లక్ష్మణ్ వివేక్ తో పాటు మంగళగిరి పట్టణానికి చెందిన 100 కుటుంబాలు మరియు తాడేపల్లి పట్టణం 14వ వార్డుకు చెందిన పెద్దింటి బాబురావు, బొల్లెద్దుల మరియన్న, నందిగం సదాశివ రావు తో పాటు వైకాపా కు చెందిన 60 కుటుంబాలు లోకేష్ సమక్షంలో టిడిపి లో చేరారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... మంగళగిరిని రాష్ట్రంలోనే నెం.1గా తీర్చిదిద్దే ప్రణాళికలు తమవద్ద ఉన్నాయని తెలిపారు. మరో 3నెలల్లో చంద్రబాబునాయుడు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళగిరి సమగ్రాభివృద్ధికి తమవద్ద ఉన్న ప్రణాళికలను అమలుచేస్తానని చెప్పారు. వివిధ రాజకీయపార్టీల నాయకులతోపాటు తటస్థులు, వివిధ రంగాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు తనపై నమ్మకంతో పార్టీలోకి రావడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి