కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రధాన కమీషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం సోమవారం రాత్రి విజయవాడకు చేరుకుంది రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా గన్నవరం విమానాశ్రయంలో వీరికి స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో విజయవాడలోని నోవాటెల్ హోటల్లో సీఈసీ రాజీవ్ కుమార్ భేటీ కానున్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి వెళ్లి సీఈసీకి రాష్ట్రంలోని పరిస్థితులపై ఫిర్యాదు చేయనున్నారు. వైకాపా నుంచి ఆ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్ ఈసీ బృందాన్ని కలవనున్నారు. మధ్యాహ్నం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల సన్నద్ధతపై సీఈసీ నేతృత్వంలోని బృందం సమీక్ష నిర్వహిస్తుంది. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు సంబంధించిన అధికారులతో సీఈసీ భేటీ అవుతారు.
సాయంత్రం విలేకర్ల సమావేశం నిర్వహించి పర్యటన వివరాలు వెల్లడించనున్నారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి