కృష్ణపట్నం పోర్టు తరలిపోతే ఏపీకి బొగ్గు, బూడిదే మిగులుతుందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కంటైనర్ పోర్టు తరలిపోతే ఏపీకి ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందని అన్నారు.
కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ ఫిబ్రవరి 1 నుండి వెళ్లిపోతుంది... ముత్తుకూరుకి ఇంక మిగిలేది బూడిదే.. కృష్ణపట్నం టోల్ గేట్ దందా వల్ల సర్వేపల్లికి, జిల్లాకి ఎంత దుస్థితి వచ్చిందో చూడు కాకాణి అంటూ మండిపడ్డారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని పేర్కొన్నారు. పోర్టు తరలిపోతే నెల్లూరు జిల్లాకే కాదు ఏపీకి విలువైన సంపద పోతుందని గుర్తుంచుకోవాలన్నారు. కృష్ణపట్నం అదానీ పోర్టును తరలించవద్దని అఖిలపక్షం ధర్నాకి ఆయన మద్దతు తెలిపారు. 2019 లో 6 లక్షల కంటైనర్లు ఇప్పుడు 4 లక్షలకు పడిపోయాయి అని ఆవేదన వ్యకతం చేసారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి