ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇవాళ ఉదయం నుంచి అసహనంగా కనిపించారని తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి, అతని భార్య అవినీతి పై ఓ ప్రధాన పత్రికలో వచ్చిన కథనం ఆయనలో అసహనం పెంచినట్లు ఉందన్నారు.
ఇవాళ బడ్జెట్ ఉన్నా, మమ్మల్ని త్వరగా సస్పెండ్ చేయటానికి కారణం కూడా అదే కావొచ్చని రామానాయుడు అన్నారు. పత్రికలో కథనం చదివాక స్పీకర్ ముఖ కవళికల్లో మార్పు ఉందని అసెంబ్లీలో అంతా చెప్పుకుంటున్నారు అని తెలిపారు. ఆ అసహనంతోనే రైతుల గోడు వినేందుకు కూడా స్పీకర్ ఇష్టపడలేదన్నారు. రైతు సమస్యలు ఎక్కడ వినాల్సి వస్తుందనే భయంతోనే తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారని నిమ్మల పేర్కొన్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఓ ప్రముఖ మీడియా సంస్థ సంచలన వార్తను వెలువరించింది. విషయం ఏమిటంటే శ్రీకాకుళం జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గ ప్రముఖ ప్రజాప్రతినిధి వైసీపీ తరఫున గెలిచిన పెద్ద మనిషి తన పదవిని అడ్డం పెట్టుకుని దోపిడీకి తెరలేపారట. ఇక ఆయన దందాకు ఆయన సతీమణి, కొడుకు కూడా తోడయ్యారట. అందరూ కలసి నియోజకవర్గంపై పడి దోచుకుంటున్నారని సారాంశం.ఈ కథనమే స్పీకర్లో అసహనాన్ని రేకెత్తించిందని నిమ్మల పేర్కొన్నారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి