నారా భువనేశ్వరి చేపట్టిన 'నిజం గెలవాలి' యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాల్ని ఆమె పరామర్శిస్తున్నారు. జగ్గంపేట మండలం గుర్రంపాలెంలో టీడీపీ కార్యకర్త పడాల వీరబాబు కుటుంబాన్ని భువనేశ్వరి ఓదార్చారు.
కుటుంబసభ్యుల యోగక్షేమాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్థికసాయం కింద రూ. 3లక్షల చెక్కును అందజేశారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
నేడు తుని, కాకినాడ నియోజకవర్గాల్లోనూ ఆమె పర్యటించనున్నారు.
గురువారం పి.గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట.. శుక్రవారం అనపర్తి, నిడదవోలు, కొవ్వూరు, రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగనుంది.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి