కాకినాడలో ప్రభుత్వ ఉద్యోగిపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చిన్నారావు దాడి చేశాడు. ఉప్పాడ సచివాలయం-3 మత్స్యకార సహాయకుడు పరుశురామ్ పై అనుచరులతో కలిసి చిన్నారావు దాడికి తెగబడ్డాడు. చిన్నారావు రొయ్యల చెరువులకు విద్యుత్ రాయితీ రాకపోవడంతోనే దాడి చేసినట్లు తెలుస్తోంది.
ఇదే మండలంలోని కోనపాపపేట పైపులైన్ల వ్యవహారంపై కలెక్టర్ నియమించిన విచారణ కమిటీ సభ్యులు సోమవారం మధ్యాహ్నం తహసీల్దారు కార్యాలయానికి వచ్చారు. సమీక్ష అనంతరం కార్యాలయం నుంచి బయటకు వస్తున్న క్రమంలో మత్స్యశాఖ, కర్మాగారాలశాఖ, కాలుష్య నియంత్రణ మండలి, అటవీ శాఖల జిల్లా అధికారుల సమక్షంలోనే వైకాపా నాయకుడు, ఆయన అనుచరులు మత్స్యశాఖ సహాయకుడిపై దాడికి పాల్పడ్డారు.
అతని చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లార ఆయనను కొట్టవద్దని, వదిలేయాలని జిల్లా మత్స్యశాఖ అధికారి పి.వి.సత్యనారాయణ వారిస్తూ.. ఏమైనా ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నా చిన్నారావు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా దాడి చేయాలని అనుచరులను ఉసిగొల్పారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ చొక్కా పట్టుకుని ఈడ్చుకెళుతుంటే.. అనుచరులు పిడిగుద్దులు బాదారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
బాధిత ఉద్యోగి ఫిర్యాదును పోలీసుస్టేషన్లో తీసుకోలేదు. కేసు కూడా నమోదు చేయకుండా కాలయాపన చేసినట్లు సమాచారం.. . అధికారపక్ష నాయకులతో నీకు గొడవెందుకు అంటూ కొందరు నాయకులు బాధితుడిని బెదిరించడం గమనార్హం.
ఎలా బతుకుతావో చూస్తా.. నువ్వు ఇక్కడికి వచ్చి ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తా.. నిన్ను చంపేస్తా అంటూ వైకాపా నాయకుడు చిన్నారావు నన్ను బెదిరించారు. మా ఉన్నతాధికారులు చూస్తుండగానే నన్ను కొట్టారు. నా సెల్ఫోన్ లాక్కున్నారు. దుర్భాషలాడారు. ప్రభుత్వ ఉద్యోగిపై ఇంత దారుణంగా దాడిచేస్తే మేమెలా ఉద్యోగాలు చేయాలి. నాకు ప్రాణహాని ఉంది. నాపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీ, జిల్లా మత్స్య శాఖ అధికారిని కోరుతున్నాను' అని బాధితుడు పేర్కొన్నాడు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి