టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఎన్టీఆర్ భవన్, మంగళగిరిలో శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. జనసేనకు కేటాయించిన సీట్లు పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే వైసీపీకి ఎందుకంత భయం అని ప్రశ్నించారు.
కులం పేరు చెప్పి తిరిగే మీరు ఏమి మాట్లాడుతున్నారు కాపులకు చంద్రబాబు 5% రిజర్వేషన్ ఇస్తే జగన్ దాన్ని రద్దు చేస్తే మీరు మాట్లాడారా అని వైసీపీ నాయకుల పైన మండిపడ్డారు...
మొన్నటిదాకా ప్రగల్బాలు పలికిన జగన్ దోచేయాల్సింది అంతా దోచేసి ఓ ఇంటర్వ్యూ లో ఇంటికి వెళ్తా అంటూ మాట్లాడుతూ ..సీఎం జగన్ ఓటమిని ముందుగానే ఒప్పుకున్నారు అని వ్యాఖ్యానించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
రిపబ్లిక్ డే రోజు పవన్ కళ్యాణ్ ప్రకటించిన రెండు సీట్ల గురించి మాట్లాడతూ పొత్తుల్లో భాగంగా ఆయన ప్రకటించారు అందులో మాకు లేని ఇబ్బంది మీకు ఎందుకు ఊరిలో పెళ్ళికి కుక్కల హడావిడిలా మీకు ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు. టీడీపీ జనసేన పొత్తుతో వైసీపీ నేతల ప్యాంట్లు తడుస్తున్నాయి, డైపర్లు కట్టుకుని తిరుగుతున్నారు అని ఎద్దేవా చేసారు. రానున్న రోజుల్లో ప్రజలు గట్టిగా బుద్ది చెబుతారు... వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమే అన్నారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి