మున్సిపల్ కార్మికుల ను మరోసారి చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల ను మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఈరోజు సాయంత్రం 3గంటలకు సచివాలయం లోని మున్సిపల్ కార్మిక సంఘాలతో సమావేశం కానుంది. సెక్రటేరియట్ లోని రెండో బ్లాక్ లో ప్రభుత్వ ప్రతినిధులు, కార్మిక సంఘాల మధ్య చర్చలు జరగనున్నాయి. రెండు వారాలుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ప్రభుత్వం మరోసారి మున్సిపల్ కార్మిక సంఘాలను చర్చలకు పిలిచింది.
మూడు రోజుల క్రితం మున్సిపల్ కార్మిక సంఘాలతో ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్చలు విఫలం అయ్యాయి. సచివాలయంలో కార్మిక సంఘాల నాయకులతో మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం అయ్యారు. మున్సిపల్ కార్మికుల డిమాండ్లపై మూడు గంటలకుపైగా...కార్మిక సంఘాలతో చర్చించారు. మున్సిపల్ కార్మిక సంఘాల డిమాండ్లన్నీ అంగీకరించామన్నారు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. హెల్త్ అలవెన్స్ రూ.6వేలు వేతనంలో కలిపి ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
హెల్త్ అలవెన్స్ పేరు లేకుండా మొత్తం వేతనంగానే ఇస్తామని ప్రతిపాదన చేశారు. కార్మికులకు పరిహారం మొత్తాన్ని కోర్టు ఉత్తర్వుల ప్రకారం చెల్లిస్తామని వెల్లడించారు. విధుల్లో మరణించిన వారికి రూ.5లక్షల నుంచి రూ.7లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని బొత్స సత్యనారాయణ కోరారు. మున్సిపల్ కార్మికులకు హెల్త్ అలవెన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీతంలోనే హెల్త్ అలవెన్స్ కలిపి రూ. 21 వేలు ఇస్తామని ఏపీ సర్కార్ హామీ ఇచ్చింది. 24 వేలు ఇవ్వాల్సిందేనంటున్న కార్మిక సంఘాలు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి