అమరావతి: పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి తగిన గుర్తింపు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి భారతీ పవార్ విమర్శించారు. విజయవాడలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. తన పర్యటనలో భాగంగా ఆరోగ్య కేంద్రాలను పరిశీలించినప్పుడు బోర్డుల్లో కేంద్ర ప్రభుత్వానికి ప్రాధాన్యం కన్పించడం లేదన్నారు.
ప్రధాని మోదీ ఫొటోలు కూడా కన్పించీ, కన్పించకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ఇలాగే కొనసాగితే.. ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధుల మంజూరును నిలిపేయడానికి వెనకాడబోమని హెచ్చరించారు. ఏపీ లోని 26 జిల్లాల్లో 125 వాహనాలతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నాం.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
35 లక్షల మంది ఇందులో భాగస్వామ్యం అయ్యారు. అర్హత ఉన్న వారు ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆరోగ్యపరమైన పరీక్షలు నిర్వహించి మందుల్ని ఉచితంగా ఇస్తున్నాం ఉచితంగా ఇస్తున్నాం. 1,672 గ్రామాల్లో హర్ ఘర్ జల్ పథకం అమలు చేశాం. భూమి రికార్డుల్ని 5,292 గ్రామాల్లో పూర్తి చేశాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్ గా మార్చాం అని భారతీ పవార్ తెలిపారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి