మన్మోహన్ సింగ్ మృతితో దేశం గొప్ప ఆర్ధికవేత్తను కోల్పోయిందని ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మన్మోహన్ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని కొనియాడారు. దేశ రాజకీయాల్లో విద్యావేత్త, గుణ సంపన్నుడు, నిజాయతీపరుడు అని పేర్కొన్నారు. దేశంలో 35 కోట్ల చిన్న, సన్నకారు రైతులకు రూ.72 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్ సింగ్ ప్రభుత్వానిదని గుర్తుచేశారు. ఆయన హయాంలోనే గ్రామీణ ఉపాధి హామీ పథకం రూపుదిద్దుకుందని చెప్పారు. దేశంలో ఉగ్రవాదాన్ని అణచివేయడానికి జాతీయ దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేశారన్నారు. 3జీ, 4జీలతో మొబైల్ విప్లవం మొదలైందని పేర్కొన్నారు.
ఇంకా చదవండి: 7 సీటర్ కార్ కొనాలి అనుకునే వారికి గుడ్ న్యూస్! అతి తక్కువ ధరతో.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!
“ఒక ఎంపీగా ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాను. ఆయన నిరాడంబరుడు. పీవీ నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన తీసుకున్న సంస్కరణలు, ఆర్థిక విధానాలు దేశంలో పేదరికాన్ని తగ్గించాయి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్గా, కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధాన మంత్రిగా ఆయన దేశానికి చేసిన సేవలు అమూల్యం. ఆర్థిక మంత్రి కాగానే ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ లాంటి సంస్థలను ఒప్పించి భారతదేశాన్ని ఆర్థిక సుడిగుండం నుంచి బయట పడేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్. సుధీర్ఘ కాలం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను" అని బాలశౌరి పేర్కొన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
7 సీటర్ కార్ కొనాలి అనుకునే వారికి గుడ్ న్యూస్! అతి తక్కువ ధరతో.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!
ఏపీలో పెన్షనర్లకు శుభవార్త! న్యూ ఇయర్ గిఫ్ట్ గా ప్రభుత్వం కీలక నిర్ణయం!
జగన్ ఇంటి ముందు ధర్నా చేయాలి.. ప్రపంచంలో ఇంత వింత ఎక్కడా! మంత్రి మండిపాటు!
రేవంత్ రెడ్డికి కీలక ప్రతిపాదనలు చేసిన సినీ ప్రముఖులు! ప్రస్తుత ప్రభుత్వంపై.. అవేంటంటే!
ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త.. వాటిపై 90 శాతం రాయితీ! వెంటనే పొందండి..
తిరుమల భక్తులకు శుభవార్త! గంటలోనే శ్రీవారి దర్శనం - అమల్లోకి టీటీడీ కొత్త విధానం!
పీఆర్, పర్సనల్ మేనేజర్ ను తొలగించిన చిరంజీవి! దీనిపై ఆరా తీయగా..
ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. మాజీ క్రికెటర్పై కేసు నమోదు!
అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!
నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: